సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి నటిస్తోన్న చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ సినిమాకు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది. దీనికోసం భారీ వ్యయంతో రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ ను నిర్మించారు. మిగిలిన సినిమా షూటింగ్ ను ఈ సెట్స్ లోనే పూర్తి చేస్తారని సమాచారం. ఇక హీరోయిన్ పూజా హెగ్డే షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఆమెపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈమధ్య పూజకి ఆరోగ్యం బాలేదు. డాక్టర్ల సలహా మేరకు హోమ్ టౌన్ వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు ఆరోగ్యం గుదుటపడడంతో ఆమె షూటింగ్ లో జాయిన్ అయింది. ‘రాధే శ్యామ్’ షూటింగ్ స్పాట్ నుండి పూజా ఒక వీడియోను తన అభిమానులతో పంచుకుంది. ఆమె డిసెంబర్ 25 వరకూ ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న తర్వాత జనవరి 2వ నుంచి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ షూటింగ్ లో జాయిన్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇక ‘రాధే శ్యామ్’ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న మలయాళ నటుడు జయరామ్ కూడా రీసెంట్ గా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ మోషన్ పోస్టర్స్ కు మంచి రెస్పాండ్ వచ్చింది. ఇదొక అద్భుతమైన ప్రేమ కావ్యం అని తెలుస్తోంది. ‘జిల్’ సినిమా తర్వాత ఆరు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయం సాధించాలని కష్టపడుతున్నాడు. ఇందులో ప్రభాస్ కు తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తుండగా యూవి క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Must Read ;- ఇక్కడే కాదు..రాశీకి అక్కడా పెరిగాయి!
The love story of #RadheShyam just got better with the marriage of Physics and Light! Cheers to the magician @manojdft sir. pic.twitter.com/63Rft0v7kQ
— Priyadarshi Pulikonda (@Preyadarshe) December 17, 2020











