డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘ఫైటర్’. ఇందులో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం ముంబాయిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంకా అక్కడ షూటింగ్ చేయాల్సివుంది. అయితే.. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు.

జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. విదేశాల్లో ఎక్కువ భాగం షూటింగ్ చేయాల్సివుంది. అందుకనే ఇన్నాళ్లు షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయకుండా ఆగారు. కరోనా తగ్గింది ఇక షూటింగ్ మొదలుపెడదాం అనుకుంటుంటే.. విదేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. విదేశాల్లో ఉన్న వాళ్లు స్వదేశాలకు పయనమయ్యారు. అక్కడ మళ్లీ లాక్ డౌన్ అంటున్నారు. భారత యంత్రాంగం అప్రమత్తమైంది. మన దేశంలో ముంబాయి, ఢిల్లీ, చెన్న, లలో రాత్రి పూట కర్ప్యూ విధిస్తున్నారు.
అంతే కాకుండా విదేశాల నుంచే వచ్చే విమానాల పై నిషేధం విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల్లో షూటింగ్ కి ఛాన్సే లేదు. ఈవిధంగా ‘ఫైటర్’ మూవీ ట్రబుల్ లో పడింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అలాగే సుశాంత్ సింగ్ ఆత్మహత్మ కు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా ఈ సినిమాకి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మరి.. ట్రబుల్స్ నుంచి బయటపడి ‘ఫైటర్’ త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని ఆశిద్దాం.
Must Read ;- విజయ్ పూరి మూవీ పై వస్తున్న వార్తలు నిజమేనా..?











