Raghu Rama Raju Satirical Comments On Jagan :
ఏపీలో జగన్ పాలనపై లెక్కలేనన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త విమర్శ వచ్చిపడుతున్న నేపథ్యంలో అసలు ఏపీలో పాలన అంటూ ఒకటి కొనసాగుతుందా? అన్న దిశగానూ చర్చ సాగుతోంది. ఈ కారణంగానే జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో పాటుగా.. ప్రతి విషయంలో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. వాటిని విచారిస్తున్న కోర్టులు జగన్ సర్కారుకు మొట్టికాయలు వేస్తున్నాయి. అయితే జగన్ సర్కారుకు సలహాలు ఇచ్చేందుకు బొచ్చెడు మంది సలహాదారులు ఉన్నారు కదా.. మరి వారు జగన్ కు ఏమాత్రం సలహాలు ఇవ్వడం లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదేమీ లేదు గానీ.. సలహాలు అయితే ఇస్తున్నారు గానీ.. సలహాలిచ్చే వారిలోనే దిమాక్ లేదని తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తేల్చి పారేశారు.
మరి అంతమంది అడ్వైజర్లంతా వేస్టేనా?
అంటే.. జగన్ సర్కారుకు సలహాలిచ్చేందుకు నియమితులైన ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా తెలివి లేదనేగా రఘురామరాజు ఆరోపణ. నిజమేనట. రఘురామరాజు ఈ విషయాన్ని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. గురువారం మీడియా ముందుకు వచ్చిన ఆయన జగన్ సర్కారు తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలన బాగుండాలంటే.. ప్రభుత్వ తీరుపై విమర్శలు రాకుండా ఉండాలంటే.. జగన్ సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే.. జగన్ కనీసం ఒక్కరినైనా దిమాక్ ఉన్నోడిని సలహాదారుగా పెట్టుకోవాలట. ఇదే మాటను రఘురామరాజు మీడియా ముఖంగా బహిరంగంగానే చెప్పేశారు. రఘురామరాజు మాట విన్న తర్వాత నిజంగానే జగన్ సలహాదారుల్లో ఒక్కరికి కూడా దిమాక్ లేదా? అన్న దిశగా సెటైర్లు పడిపోతున్నాయి.
రఘురామ ఏమన్నారంటే..?
రాజద్రోహం సెక్షన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసిన దరిమిలా.. తనపై ఇదే కేసు నమోదైన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రఘురామరాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పాలనపై సంచలన ఆరోపణలు చేశారు.రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందన్న విషయమైనా జగన్ కు తెలుస్తోందా? అంటూ ఆయన తనదైన శైలి కామెంట్ చేశారు. రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుంటే.. వాటిని ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఖర్చు పెట్టి ఉంటే.. పాలకొల్లులో రోడ్లపైనే చేపలు పెంచే కార్యక్రమం జరగదు కదా. అంటూ రఘురామరాజు సెటైరిక్ వ్యాఖ్యలు చేశారు. అంతిమంగా జగన్ పాలన బాగుండాలంటే. కనీసం ఒక్కరినైనా దిమాక్ ఉన్నోడిని దగ్గర పెట్టుకోవాలని సీఎంకు రఘురామ సూచించారు.
Must Read ;- జగన్ మిడ్ నైట్ డైరీస్.. కాపుల కోటా రద్దు