టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కరోనా పాజిటివ్ కు గురైంది. ట్విట్టర్ ద్వారా ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న ఈ తరుణంలో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా రకుల్ కు కరోనా సోకింది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇది వైరల్ అవుతోంది. తను పరీక్షలు చేయించుకోవడంతో కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందని, ప్రస్తుతం ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నానని ఆమె వివరించింది.
త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ముందుకు వస్తానని ఆమె వివరించింది. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కూడా ఆమె కోరింది. ఇటీవలే ఆమె తన కుటుంబ సభ్యులతో మాల్దీవులకు వెళ్లి అందాలు ఒలకబోసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియో షేర్ చేసి హడావుడి చేసింది. ప్రస్తుతం ఆమె క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే డ్రగ్స్ కేసు విషయంలో ముంబయి వెళ్లొచ్చింది రకుల్. ఇలా హైదరాబాద్, ముంబయి మధ్య ఎక్కువ సార్లు ప్రయాణం చేయడంవల్ల కూడా రకుల్ కు కరోనా వచ్చి ఉండొచ్చు. రకుల్ కి కరోనా రావడంపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. తను టెస్ట్ చేయించుకున్నానని, తనకు నెగిటివ్ వచ్చిందని క్లారిటీ ఇచ్చింది.
Must Read ;- బికినీలో రకుల్.. సముద్రంలో 40 అడుగుల లోతులో..
😊💪🏼 pic.twitter.com/DNqEiF8gLO
— Rakul Singh (@Rakulpreet) December 22, 2020











