ఎప్పుడూ వృత్తిపరంగా బిజీగా వుండేవాళ్ళకు సెలవులు దొరికితే వారి ఆనందానికి అవధులుండవు. ఎంచక్కా తమ ఇష్టానికి అనుగుణంగా విహారయాత్రలకు చెక్కేస్తూ .. ఆ సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కోవలోనే సినీరంగంలో బిజీ బిజీగా ఉండే హీరోహీరోయిన్లు ఆటవిడుపు కోసం సరదా సరదాగా విహారయాత్రలు చేసి రావడం చూస్తున్నదే. ఇటీవలే మహేష్ బాబు కుటుంబ సభ్యులతో దుబాయ్ చుట్టేసి రాగా..హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాల్దీవులలో హనీమూన్ ట్రిప్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ లిస్టులో మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేరింది. తెలుగు సినీ పరిశ్రమ ద్వారా గుర్తింపు సంపాదించుకుని అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ చిత్రాలు చేస్తూ అనునిత్యం రకుల్ బిజీగా ఉంటుంటుంది. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో ఆ మధ్య వరకు అన్ని భాషల షూటింగులు ఆగిపోయిన విషయం తెలియంది కాదు. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి పట్టునే ఉన్న ఆమె మళ్లీ చిత్రీకరణలో పాల్గొనేందుకు ఉత్సహం చూపిస్తున్నారు.
Also Read ;- అఫీషియల్ : అమితాబ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్
ప్రస్తుతం కొద్దిరోజులు సెలవులు దొరకడంతో సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు మాల్దీవులకు వెళ్లారు. అక్కడి బీచ్ లో మధుర క్షణాలను గడుపుతూ ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసారు. ఆనందంతో మెరుస్తూ బీచ్లో సేదదీరుతున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు చేసుకోవడానికి అనుమతులు లభించడంతో గత కొద్దిరోజులుగా వివిధ బాషల సినిమాల చిత్రీకరణలు మెల్ల మెల్లగా తిరిగి మొదలవుతున్నాయి. రకుల్ చేతిలో మూడు భాషలు కలుపుకుని అరడజను చిత్రాలకు పైగా ఉన్నాయి.
టాలీవుడ్లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ, హీరో నితిన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కలయికలో రూపొందే చెక్ చిత్రంలోనూ, కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2, అలాగే కోలీవుడ్లో శివకార్తికేయన్ చిత్రాల్లోనూ, బాలీవుడ్లో అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలలో నటిస్తున్నచిత్రంలోనూ అజయ్ దేవగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మేడే చిత్రంలోనూ రకుల్ నటిస్తోంది. ఇలా మూడు బాషల చిత్రాలతో ఆమె బిజీ బిజీగా ఉండబోతోంది. అందుకే కాబోలు కాస్త గ్యాప్ దొరకడంతో ఆమె హాలీడే ట్రిప్ లో సరదాగా గడపాలని నిర్ణయించుకుంది.
Must Read ;- కొత్త వ్యాపారంలోకి నవ వధువు