డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. సమ్మర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇందులో ఆకాష్ పూరి సరసన కేతిక శర్మ కథానాయికగా నటించింది. మాఫియా నేపధ్యంలో సాగే ఈ ప్రేమకథలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. పూరి – ఛార్మి కలిసి ఈ సినిమాని నిర్మించారు.
అయితే.. ఈ సినిమాకి ఎనర్జిటిక్ హీరో రామ్ మాట సాయం చేయనున్నారని తెలిసింది. ఇంతకీ మాట సాయం ఏంటంటారా.? ఈ ప్రేమకథకి రామ్ వాయిస్ ఓవర్ అందించనున్నారట. పూరి రామ్ ని సరికొత్త అవతారంలో ఫుల్ మాస్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చూపించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా దగ్గర నుంచి మాస్ లో రామ్ కి మాంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే రామ్ – పూరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకనే రొమాంటిక్ మూవీకి వాయిస్ ఓవర్ చెప్పమని పూరి అడిగిన వెంటనే రామ్ ఓకే అన్నారట.
రొమాంటిక్ మూవీని పూరి చూసి కొన్ని మార్పులు చేర్పులు చెప్పారట. పూరి చెప్పినట్టుగా కొన్ని సీన్స్ రీషూట్ చేశారట. టీమ్ అంతా ఈ సినిమా పై గట్టి నమ్మకంతో ఉన్నారని తెలిసింది. మెహబూబా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ కి ఆ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది కానీ.. కమర్షియల్ సక్సస్ ని అందివ్వలేదు. ఈ రొమాంటిక్ మూవీ మాత్రం సక్సస్ అందిస్తుందని ఆకాష్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారట. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. మరి.. ఆకాష్ పూరికి తొలి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Must Read ;- కోరమీసం పోలీసోడా. అంటూ శృతిహాసన్ ఏం చేసిందంటే!