మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర ఒకటి ఉందని, ఈ సినిమా కథకు ఆ పాత్ర చాల కీలకమని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ పాత్రకు అనేకమంది సీనియర్ యాక్టర్ల పేర్లు పరిశీలించిన దర్శకుడు త్రివ్రిక్రమ్ చివరికి రమ్యకృష్ణను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రమ్యకృష్ణను కలిసి త్రివిక్రమ్ కథ వినిపించాడని, కథలో తన పాత్ర నచ్చి రమ్యకృష్ణ కూడా ఓకే చెప్పారని సమాచారం. ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నదని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అత్త పాత్రకు సీనియర్ హీరోయిన్ నదియాను తీసుకోని మంచి హిట్ కొట్టాడు. ‘అత్తారింటికి దారేది’ సినిమాతో నడియాకు మంచి పేరు వచ్చింది అనడంలో సందేహం లేదు.
అలాగే ‘అలా వైకుంఠపురములో’ ముఖ్యమైన తల్లి పాత్రకు సీనియర్ హీరోయిన్ టబును తీసుకోని ఎంతో చక్కని డ్రామాను నడిపించారు త్రివిక్రమ్. మరోసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాకు సంబంధించిన ముఖ్యమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణను తీసుకోవడం అంటే మంచి ఆలోచనే అని చెప్పాలి. ఇప్పటికే బాహుబలి చిత్రం ద్వారా ఆమె భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటించడం వలన సినిమాకు బాగా ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి.
Must Read ;- అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా?