మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కరోనా కారణంగా థియేటర్లో సిటింగ్ కెపాసిటి 50 శాతమే ఇచ్చారు. అయినప్పటికీ.. క్రాక్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రవితేజ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా క్రాక్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో రవితేజకు మళ్లీ డిమాండ్ పెరగింది. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఖిలాడీ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరిలో ఉంది.
ఈ సినిమాతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో కూడా రవితేజ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా రవితేజ రెమ్యునరేషన్ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. క్రాక్ తర్వాత భారీ స్థాయిలో రవితేజ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..
సాధారణంగా రవితేజ సినిమాకు 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటాడు. క్రాక్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. రవితేజ ఏకంగా 17 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
క్రాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనితో రవితేజ తన రెమ్యునరేషన్ రీజనబుల్ అని భావిస్తున్నాడేమో. రవితేజ రెమ్యూనరేషన్ పెంచినప్పటికీ.. ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఖిలాడీ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతుంది. మరి.. ఈ సినిమా సక్సస్ అయితే.. రెమ్యూనరేషన్ మరింత పెంచుతాడేమో చూడాలి.
Must Read ;- రవితేజ, నాగచైతన్య, సమంత, నిఖిల్ షూటింగ్ డేట్స్ ఫిక్స