పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడయినా ఎలాంటి భేషిజాలు లేకుండా కింది స్థాయి నాయకులకు కూడ అభినందనలు తెలియజేస్తున్నారు. మరో వైపు అందరితో కలిసి పనిచేస్తూ తెలంగాణలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చేందుకు తగిన చర్యలకు శ్రీకారం చుట్టారు. తనకు పీసీసీ పదవి ఇచ్చిన సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకులందరినీ వ్యక్తిగతంగా కలుస్తూ తనదారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులైన జ్ణానారెడ్డి, విహెచ్ హనుమంతరావులను కలిసి కాంగ్రెస్ పటిష్టానికి కలిసి పనిచేద్దామంటూ వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
లింగోజిగూడ కార్పొరేటర్ ప్రమాణ స్వీకారానికి హాజరై..
హైదరాబాద్లోని లింగోజిగూడ డివిజన్కు జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పేల్లి రాజశేఖర్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రేవంత్రెడ్డి హాజరై కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేసిన రాజశేఖర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పీసీసీ చీఫ్గా ఎంపికైన రేవంత్రెడ్డికి మేయర్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు.
‘చెత్త నగరంగా హైదరాబాద్’
పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ హైదరాబాద్ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్గా నిర్వహించడం వెనుక దరుద్ధేశాలు ఏంటని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఆయన బల్దియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను జీహెచ్ఎంసీలోకి ఎందుకు అనుమతించట్లేదని ఆయన అధికారులను నిలదీశారు. మేయర్ని కలిసి మీడియాని లోపలికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. ‘తూతూ మంత్రంగా.. టూత్ పాలిష్లాగా …హైదరాబాద్ని చెత్త నగరంగా చేస్తున్నారు’ అని మండిపడ్డారు. 16 పట్టణాల్లోని నివాసయోగ్యమైన ప్రాంతాల్లో హైదరాబాద్ లేదన్నారు. చెత్త నగరంగా హైదరాబాద్ని తయారు చేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో సిటీస్లో హైదరాబాద్కు స్థానం లేదని తెలిపారు. మంత్రి కేటీఆర్ మూసీలో నాలుగు గంటలు నిలబడితే అసలు సమస్యలు తెలుస్తాయని, త్వరలో ఆ రోజు వస్తుందని రేవంత్రెడ్డి అన్నారు.
తూతూ మంత్రంగా మూసీ అభివృద్ధి చర్యలు
మూసీ అభివృద్ధి చర్యలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని రేవంత్రెడ్డి విమర్శించారు. త్వరలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. తెలంగాణకు హైదరాబాద్ నగరం గుండెకాయ అని, ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితమని తెలిపారు. అన్ని రకాల పన్నులు పెంచారని, రూ.800 కోట్లతో వరద నివారణ పనులు చేపడతామని ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. నాలాలు, చెరువులు కబ్జా చేసుకున్నాక చర్యలు చేపడతారా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్, మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఒక మాఫియాగా ఏర్పడ్డారన్నారు. నాలాలు, చెరువులు కబ్జాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మాఫియాకు అనుకూలంగా ఉండేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం లేదని రేవంత్రెడ్డి ఆరోపించారు.
Must Read ;- దొర అరాచకాలకు చెక్ పెడతా!











