నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. నిడమనూరు ఆర్వో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు సమయం ఉండనుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఇప్పటి వరకు 20 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీజేపీ అభ్యర్థి రవికుమార్ నామినేషన్కు ఎమ్మెల్యే రాజా సింగ్, ఇంచార్జ్లు సంకినేని వెంకటేశ్వరరావు, చాడా సురేష్ రెడ్డి హాజరుకానున్నారు. బీజేపీ నుంచి రెబల్ అభ్యర్థిగా కడారి అంజయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో సాగర్ ఆసక్తి పోరు ఆసక్తి కరంగా మారింది.
Must Read ;- కాంగ్రెస్ జనగర్జన.. కేసీఆర్ వస్తే తాము చేసినవి చూపుతామన్న జానా