డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ను హీరోగా నిలబెట్టాలని ఒకప్పుడు ఎంతో ట్రై చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. అతడి ఎంట్రీ సినిమాతో సహా.. మిగిలిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అయితే అతడికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాగా ‘బంఫరాఫర్’ మాత్రం నిలిచిపోయింది. జయరవీంద్ర దర్శకత్వంలో బిందు మాధవి కథానాయికగా నటించిన ఈ సినిమా పూరీ ‘ఇడియట్’ మాదిరి జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేసింది. 2009లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది.
మళ్ళీ ఇన్నాళ్ళకు అంటే.. దాదాపు పన్నెండేళ్ళు తర్వాత సాయిరామ్ శంకర్ హీరోగా ‘బంపరాఫర్’ కు సీక్వెల్ అనౌన్స్ అయింది. అదే దర్శకుడు జయరవీంద్ర దర్శకత్వంలో .. వేరే కథతో ‘బంపరాఫర్ 2’ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. అప్పట్లో పూరీ నిర్మాణంలో వైష్ణో అకాడమి బ్యానర్ పై ఈ సినిమా రూపొందగా.. ఇప్పుడు సురేశ్ ఎల్లం రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను ట్విట్టర్ లో ప్రకటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ , తదితర సాంకేతిక వర్గం ఇంకా ఎంపిక కాలేదు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఉగాదికి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది.
Must Read ;- ఆకాష్ పూరీ ‘ రొమాంటిక్’ గా రాబోతున్నాడు.. !
This time it’s #BumperOffer2 with Double the Entertainment
Need all your love and support 🙏 kick starting this Ugadi @Jayaravindraoff @CinemaasDukann @sureshvijayapro @venupro @dhani_aelay pic.twitter.com/6am8AiMdvl
— Sai Raam Shankar సాయిరామ్ శంకర్ (@sairaamshankar) March 6, 2021