తిరిగి పురుడుపోసుకుంటున్న రౌడీయిజం..!
ఒకప్పుడు విజయవాడ పేరు చెబితే.. రవితేజ సినిమా ‘కృష్ణా’, రాంగోపాల్ వర్మ చిత్రాలు గుర్తు రావాల్సిందే! ఎందుకంటే విజయవాడలో రౌడీయిజం అంత పాపులర్ కాబట్టి! చాపకింద నీరులా ప్రస్తుతం క్రైం స్తబ్దతగా ఉన్నా.. అప్పుడప్పుడు దాని రూపాన్ని మార్చుకుని పంజా విసురుతునే ఉంటుంది. ప్రస్తుతం విజయవాడలో ముఠా తగదాలు, ఆదిపత్యపోరు తిరిగి పురుడుపోసుకుంటున్నాయి. ఈ కోవకు చెందిందే రాధా హత్యకు కుట్ర నేపధ్యం! రాధాను హత్య చేయబోయే విషయం పోలీసుల వద్ద కూడా సమాచారం ఉంది అన్నది.. రాధాతోపాటు ఆయన వర్గీయులు వాదిస్తున్న పచ్చి నిజం!
రాధాను చంపేందుకే కుట్రలు జరుగుతున్నాయి..!
వంగవీటి మోహన్ రంగా హత్య తరువాత విజయవాడలో దేవినేని, వంగవీటి కుటుంబాలు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఈ క్రమంలో రాధా చేసిన హాట్ కామెంట్స్ తో అవర సత్యం, దేవినేని అవినాష్ లు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం రాధాను వ్యక్తి భద్రత పెంచెందుకు 2+2 సెక్యూరిటీ తోపాటు, ఆరోపణలకు ఆధారాలు సేకరించి నివేదికివ్వాలని జగన్ ఇంటెలిజెన్సీ డీజీని ఆదేశించాడు. ఇదిలా ఉండగా.. గత మూడు రోజులుగా రాధా ఆఫీస్ వద్ద ఉన్న స్వీట్ షాప్ ఎదుట స్కూటీ ఒకటి వదిలి వెళ్లడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని అనుచరులు పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. అసలు స్కూటీ ఎవరిది? ఎందుకు ఇక్కడ వదిలేసి వెళ్లారు అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాధాను చంపేందుకు రెక్కీ నిర్వహించిన ముఠాలో ఎవరైనా దీనిని ఇక్కడ వదిలి వెళ్లారా? అని అనుమానాలు వ్యక్తమౌవుతున్నాయి. రెక్కి నిర్వహించిన వారిని గుర్తించి, అరెస్ట్ చేస్తే తప్పా.. విజయవాడ రేగిన అలజడులు సద్దుమనిగేలా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Must read ;- వంగవీటి రంగాలాగే.. రాధాను చంపేందుకు స్కేచ్చా?