భారతీయ తెరపై మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’. యన్టీఆర్, రామ్ చరణ్ ల్ని పీరియాడికల్ గా ఫిక్షనల్ జెర్నీ చేయిస్తోన్న దర్శక ధీరుడు రాజమౌళి.. ఇప్పటికే ఇరువురు హీరోల అభిమానులకు.. వారి వారి టీజర్స్ తో ఖుషీ చేశాడు. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో విజువల్ ఫీస్ట్ ఖాయం అని ఫిక్సయిపోయారు. ఇక ఈ సినిమా షూటింగ్ పార్ట్ హైద్రాబాద్ లోనే జరుపుకుంటోంది. ఒక పక్క తండ్రి చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమాను నిర్మిస్తునే .. మరో పక్క ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న చెర్రీకి.. ‘ఆచార్య’లో తన పోర్షన్ కు సంబంధించిన ఎపిసోడ్ తో నటించాల్సిన సమయం ఆసన్నమైంది.
సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పార్ట్ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం. అందుకే ఈ సినిమాలో నటించేందుకు రామ్ చరణ్ రాజమౌళి నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడట. ఆ మేరకు జక్కన్న చెర్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సంక్రాంతి తర్వాత చరణ్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. ఒకే ఒక షెడ్యూల్ లో చరణ్ కు సంబంధించిన షెడ్యూల్ కంప్లీట్ చేస్తాడట కొరటాల శివ. 2021 సమ్మర్ లో విడుదల కానున్న ఆచార్య మూవీ షూటింగ్ లో చిరంజీవి త్వరలోనే జాయిన్ అవుతారట.
Must Read ;- మెగాస్టార్ తో ఆడిపాడేందుకు ఎవరూ ఉండారా?