నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ‘సింహ, లెజెండ్’ మూవీస్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈ సినిమా అభిమానులకు చాలా ప్రత్యేకం కానుంది. యన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మే 28న సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే.. మూవీకి సంబంధించిన టైటిల్ రివిలేషన్ ఉగాది నాడు జరగబోతోందని తెలుస్తోంది. ఇక సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను దాదాపు ఖాయం చేశారు అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.
ఇక బీబీ 3 సినిమాకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్టేడ్ .. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రకు తమిళ నటుడు శరత్ కుమార్ ఎంపికయ్యారట. ఆల్రెడీ ఒక విలన్ గా శ్రీకాంత్ నటించనుండగా… ఇప్పుడు శరత్ కుమార్ ను కూడా ఎంపిక చేశారట. బోయపాటి ‘జయజానకి నాయక’ లో శరత్ కుమార్ నటించడంతో .. ఆయనతో ఉన్న మంచి రిలేషన్ తో బీబీ 3 లో ఆయన్ను విలన్ గా ఒప్పించారట బోయపాటి. మరి బాలయ్య కి శరత్ కుమార్ ఎంత పవర్ ఫుల్ విలన్ అవుతారో చూడాలి.
Must Read ;- బాలకృష్ణ రైట్ హ్యాండ్ గా జేబీ?











