విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు సైతం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెదేపా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆమోదంతోనే ఒప్పందం జరిగిందని ఆరోపించారు. సీఎం జగన్ నిజస్వరూపం బట్టబయలైందన్నారు. ప్రైవేటీకరణ చేసి వాటాల కోసం యత్నించడం దారుణమని అయ్యన్న విమర్శించారు.
శారద పీరం సందర్శించడానికి, ప్రత్యేక విమానంలో వెళ్లిన సీఎం గారికి, కనీసం విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం దీక్షలు చేపడుతున్న వారిని కనీసం పలికరించే సమయం కూడా ముఖ్యమంత్రికి లేదని అయ్యన్న సీఎంను ప్రశ్నించారు. దీనికంతటికి సూత్రధారి విజయసాయిరెడ్డి అని.. అలాంటి వ్యక్తి పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం చేస్తున్న పనులు తొందరలోనే బయటపడతాయని.. అప్పుడు ప్రజలు వీళ్లను తరిమి కొడతారని తెలియజేశారు.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!