నిన్న జరిగిన తిరుపతిలో పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి ఎన్నికల కోసం వైసీపీ బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తుందని, ఎన్నికల సంఘానికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నిసార్లు ఎన్నికల సంఘానికి, పోలీసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, అందుకే నిరసనలు తెలియజేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు.
సుగుణమ్మను దూషించి..
దొంగ ఓట్లు వేసేందుకు స్థానికేతరులు అధిక సంఖ్యలో రావడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మండిపడ్డారు. వాళ్లను ప్రశ్నించగా పాస్పోర్టు కోసమని కొందరు, ఆస్పత్రికి వచ్చామని మరికొందరు.. సరదాగా వచ్చామంటూ ఇంకొందరు సమాధానమిచ్చారు. సుగుణమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఒక మహిళని అని చూడకుండా దూషణలకు దిగారు. ‘అసలు నీకు ఇక్కడ పని ఏంటీ. ఎవరే నువ్వు’ అంటూ కొందరు వైసీపీ నేతలు ఆమెను దూషించారు. అక్కడితో ఆగకుండా బూతులకు దిగారు. దీంతో కొందరు మీడియావాళ్లు వీడియోలు తీయగా, వాళ్ల నుంచి సెల్ ఫోన్ లాక్కొని వీడియోలు డెలిట్ చేశారు. దొంగ ఓట్లు వేయడం తప్పు కదా ఇతర పార్టీల నాయకులు ప్రశ్నించగా, తిరుపతి వాళ్లకు కరోనా వచ్చిందని, వాళ్ల బదులు ఏం ఓటేస్తే తప్పేంటి అని బాహాటంగా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నాయకులు, కార్యకర్తుల ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడంతో తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.
Must Read ;- ప్రజాస్వామ్యం ఖూనీ : తిరుపతి ఉప ఎన్నికల్లో పోటెత్తిన దొంగఓటర్లు