‘కోలో కోలన్న కోలో’ అనగానే సాధారణంగా మనకు కోలాటం పాటలు గుర్తొస్తాయి. నిజానికి ఇది జానపదం పాటే. ‘టక్ జగదీష్’ కోసం ఈసారి ఈ కోలాటం తరహా పాటను తెరకెక్కించారు. ‘కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి.. కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్లల్లో కొలువుండాలి’ అనే పల్లవితో ఈ పాట సాగుతుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. ఈ పాటలను ఈరోజు ఉదయం విడుదల చేశారు. నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా టక్ జగదీష్ రూపొందుతోంది. దీనికి శివ నిర్వాణ దర్శకుడు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత నానితో శివనిర్వాణ చేస్తున్న చిత్రమిది.
https://www.youtube.com/watch?v=h5pOZ64k9wo
ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కూ, ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ పాటకూ మంచి స్పందన లభించింది. గ్రామీణ నేపథ్యం లో రూపొందే ఈ చిత్రంలో నాని అన్నగా జగపతిబాబు, తండ్రిగా నాజర్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు.
Must Read ;- నానీ కూడా పారితోషికం పెంచేశాడా?











