కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో వైసీపీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందే ఆయన వర్గీయులు రెండుగా విడిపోయి బాహాబాహీకి తలపడ్డారు. ఈ గొడవలో వైసీపీ నేతలు కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆధిపత్యపోరే ఇరువర్గాల గొడవకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనతో గన్నవరం వైసీపీలో నాలుగో వర్గం తెరమీదకు వచ్చినట్టయింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆపేవారే లేరా?
గన్నవరం వైసీపీలో ఇప్పటికే మూడు వర్గాలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో దుట్టా, యార్లగడ్డ, వంశీ వర్గీయులు తలపడ్డారు. అనేక సార్లు వైసీపీ సీనియర్ నేతలు వీరి మధ్య సయోధ్యకు ప్రయత్నం చేశారు. అయినా వీరు తన్నుకోవడం మాత్రం ఆపలేదు. చివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే వంశీలు కలసి పనిచేయాలని చేతులు కలిపినా, వారి మనసులు మాత్రం కలవడం లేదు. తాజాగా వంశీ వర్గీయులే ఆధిపత్యపోరులో రెండుగా విడిపోయికొట్టుకోవడంతో గన్నవరం వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Must Read ;- గన్నవరంలో వైసీపీ దళిత నేత ఆత్మహత్యాయత్నం