మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అలాగే.. విడుదల తేదీ కూడా వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం సినిమా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ఇదిలా ఉంటే.. మరో పక్క చిరు తదుపరి చిత్రం లూసిఫర్ మలయాళ మూవీ రీమేక్ కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా సాగుతోంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ మెగాభిమానుల్ని ఖుషీ చేస్తోంది. అదేంటంటే.. ఇందులో మెగాస్టార్ పోషించే కింగ్ మేకర్ పాత్ర కు ఓ చెల్లెలు ఉంటుంది. చిన్నప్పటి నుంచి అతడ్ని ద్వేషించి.. పెరిగిపెద్దయ్యాకా.. అనుకోని పరిస్థితుల్లో అతడి సహాయం కోరుతుంది. ఈ పాత్రకు ఇంతకు ముందు సాయిపల్లవిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూబీ విద్యాబాలన్ ను ఎంపిక చేయబోతున్నారట.
ఆల్రెడీ విద్యాబాలన్.. బాలయ్య నటించిన ‘యన్టీఆర్’ సిరీస్ లో బసవతారకం పాత్రను అత్యద్భుతంగా పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లోనూ ఆమెను ఎంపిక చేయనుండడం విశేషాన్ని సంతరించుకుంది. ఆమె అది ఆ పాత్రకు అన్ని విధాల పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ‘కింగ్ మేకర్, రారాజు’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.
Must Read ;- ‘లూసిఫర్’ రీమేక్ … ఆ వార్తలన్నీ హంబక్