శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి నిన్న రోడ్షో నిర్వహించారు. ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి పరిధిలోని వాంపల్లెలో ప్రచారం నిర్వహించి తర్వాత, పోలి అనే గ్రామానికి వెళ్లేయత్నం చేశారు. అక్కడ ఎమ్మెల్యేకు ఘోర అవమానం ఎదురైంది. పలు అంశాలపై స్థానికులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేయకుండానే, అక్కడనుంచి వెళ్లిపోయారు. పోలి గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగాడు. తమ గ్రామంలో ప్రచారాని రాకూడదని, మా గ్రామానికి ఎలా వస్తావంటూ సవాల్ విసిరారు. దీంతో నిరాశ చెందిన ఎమ్మెల్యే ఇంటిబాట పట్టారు.
ఆ తర్వాత పల్లంపేటలోనూ ఎమ్మెల్యేకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఓ వర్గానికి మాత్రమే ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారని స్థానికులు అడ్డుకున్నారు. పోలి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న యువకుడు, వైసీపీ కార్యకర్తే అని తెలిసింది. ఒక కార్యకర్తే వైసీపీ ఎమ్మెల్యేపై మాటల యుద్దానికి దిగడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.











