Why Are Corporate Companies Coming To Telangana :
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు పోటీ పడాలని అంతా భావించారు. సుహృద్భావ వాతావరనంలో చోటుచేసుకునే ఈ పోటీ.. రెండు రాష్ట్రాలను పురోభివృద్ధిలో పయనించేలా చేస్తాయని కూడా అంతా అనుకున్నారు. అయితే ఈ పోటీ మాట అటుంచితే.. జల వివాదాల్లో రెండు రాష్ట్రాలు సిగపట్లకు దిగుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిపరంగానూ రెండు రాష్ట్రాలు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్లకు తగిన గౌవరం ఇస్తూ.. రాయితీలు ఇస్తూ తెలంగాణ దూసుకుపోతుంటే.. కార్పొరేట్లు అంటేనే గిట్టనట్లుగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారు కారణంగా.. ఏపీకి వచ్చిన కంపెనీలు సైతం పలాయనబాట పడుతున్నాయి. వెరసి పారిశ్రామికాభివృద్ధి పరంగా తెలంగాణ దూసుకుపోతుంటే.. ఏపీ మాత్రం గతంలో సాధించిన అభివృద్ధిని కూడా దిగజార్చుకుంటోంది.
గుర్నానీకి కేటీఆర్ గొడుగు
పై ఫొటో చూశారా? ఇందులో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కాకుండా కేసీఆర్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా ఉన్న కేటీఆర్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీకి గొడుగు పట్టారు. గత వారం సీపీ గుర్నానీ హైదరాబాద్ వచ్చారు. సనత్ నగర్ లోని సెయింట్ థెరిస్సా ఆసుపత్రితో పాటు ఏటూరు నాగారం ఆసుపత్రికీ మహీంద్రా కంపెనీ అందించిన ఆక్సిజన్ ప్లాంట్ లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుర్నానీతో పాటు మంత్రి కేటీఆర్ కూడా పాలుపంచుకున్నారు. ఆ సమయంలో వర్షం పడుతూ ఉంటే.. గుర్నానీకి కేటీఆర్ గొడుగు పట్టారు. ఇది చూడ్డానికి చిన్న విషయంగానే కనిపించినా.. ఓ మంత్రి, అధికార పార్టీకి కాబోయే అధ్యక్షుడి హోదాలో ఉన్న రాజకీయ నేత తనకు గొడుగు పట్టిన వైనాన్ని చూసి గుర్నానీ ఆశ్చర్యపోయారు. కేటీఆర్ అంటే గౌరవమూ పెంచుకున్నారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ కోరితే.. తెలంగాణలో మహీంద్రా ప్లాంట్ ఏర్పాటుకో, విస్తరణకో గుర్నానీ కాదంటారా? అందుకే.. తెలంగాణకు కార్పొరేట్లు పరుగు పరుగున వస్తున్నారు.
కార్పొరేట్లనే బెదిరిస్తే ఎలా..?
ఈ ఫొటో చూశారా? ఓ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధిని ఓ రాజకీయ నేత వేలు చూపెట్టి మరీ బెదిరిస్తున్నారు. ఆ కార్పొరేట్ వ్యక్తి కియా కంపెనీ ప్రతినిది కాగా.. ఆయనను బెదిరిస్తున్న వ్యక్తి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. ఆ మధ్య తన నియోజకవర్గ పరిధిలోని కియా కంపెనీలో ఏదో కార్యక్రమం జరిగితే.. దానికి హాజరైన మాధవ్.. ఆ కంపెనీ ప్రతినిధిని ఇలా బెదిరించారు. ఈ ఘటన నాడు ఏపీలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగానూ వైరల్ అయ్యింది. ఓ కార్పొరేట్ ప్రతినిధిని బెదిరించిన తన పార్టీ ఎంపీని జగన్ కనీసం మందలించలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో అయితే మీడియాకు దొరికింది గానీ.. మీడియా కంటబడకుండా ఇతర కార్పొరేట్ కంపెనీలను జగన్ అండ్ కో ఏ మేర బెదిరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు నిదర్శనంగానే విశాఖలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కూడా చేసుకున్న లులూ గ్రూపు ఏకంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుని మరీ వెళ్లిపోయింది. అల్లానా కంపెనీ కూడా అదే దారిలో ఉంది. కియా తన కంపెనీ విస్తరణను ఏకంగా రద్దు చేసుకుంది. ఇక రాష్ట్రానికి చెందిన అమరరాజా గ్రూపు తన కంపెనీ విస్తరణను పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తరలించే యత్నం చేసింది. ఇలా బెదిరింపులకు దిగితే.. ఏపీకి కంపెనీలు ఎలా వస్తాయి?.
Must Read ;- బాబు పోయి జగన్ వచ్చే!.. టాప్ 4 పోయి 13 వచ్చే!