దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. గ్లోబర్ సమ్మిట్-2020 కూడా హైదరాబాద్ నేతృత్వంలో జరుగుతుండడం విశేషం. దేశంలోని కంపెనీతో పాటు, విదేశాల్లోని వివిధ ప్రముఖ కంపెనీలు తమ బ్రాంచ్ లను స్థాపించడానికి హైదరాబాద్ సరైన నగరంగా గుర్తిస్తున్నారు. కరోనా కాలంలోనే ఎన్నో కంపెనీలు హైదరాబాద్ లో కంపెనీలు పెట్టడానికి మొగ్గుచూపడం విశేషం. తాజాగా 64 విదేశీ రాయబారులు భాగ్యనగరానికి విచ్చేశారు.
భారత్ బయోటెక్ ని సందర్శించారు
64 దేశాల నుండి వచ్చిన విదేశీ రాయబారులు హైదరాబాద్ నగరంలోని రెండు ప్రముఖ కంపెనీలు భారత్ బయోటెక్, బయోలాజికల్ సంస్థలను సందర్శించారు. 64 దేశాల ప్రతినిధులను సిఎస్ సోమేష్ కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 50 బిలియన్ల డాలర్లతో ఫార్మా కంపెనీలు అభివృద్ధి అవుతున్నాయని పేర్కోన్నారు. 3 కొవిడ్ వ్యాక్సిన్లు హైదరాబాద్ కేంద్రంగా తయారువుతున్నాయని తెల్పారు. భారతదేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ హబ్ గా మారిందని, తొందరలోనే తుది ఫలితాలు వెల్లడై కొవిడ్ వ్యాక్సిన్ అధికారకంగా విడుదలవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కోన్నారు.
Must Read ;- జీనోమ్ వ్యాలీ.. బాబు ఆలోచన విలువ రూ.6 లక్షల కోట్లు