రోశయ్యకు దేశవ్యాప్తంగా ప్రముఖుల నివాళి .. మరి ఏపీ సీఎం..?
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి అందర్ని కలిచివేసింది. ఆరు దశాబ్థాల సుదీర్ఘ రాజకీయాల్లో అనేక పదవులకు వన్నె తెచ్చిన మేటి నాయకుడిగా మంచి గుర్తింపు సాధించిన రోశయ్య అంటే దివంగత నేత వైఎస్ కు ఎంతో ఇష్టం. ఆయనకు రోశయ్య అత్యంత ఆప్తుడు.. ఆత్మకూడా! ఎందుకంటే వైఎస్ పథకాల హామీలు, సంక్షేమం వంటివి ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే చకచక బడ్జెట్ ను సిద్ధం చేసి అందజేయడంలో రోశయ్యది అందవేసిన చేయి. దేశ ప్రధాని నుంచి సుప్రీ కోర్టు చీఫ్ జస్టిస్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, ఉద్దండులు రోశయ్యకు నివాళులర్పించారు. సంతాపం తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సైతం తరలివెళ్లి రోశయ్య పార్థివ దేహం సందర్శించి నివాళులర్పించారు. ఇలా పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నేతలు రోశయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్న వేళా .. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి తన సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ వలె ఒక ఫోస్ట్ పెట్టి, సంతాపం వ్యక్తం చేశారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చికు దారితీసింది. జగన్ రెడ్డి మనో వైకల్యాన్ని ప్రశ్నిస్తోంది. రాజకీయాల్లో కురువృద్ధుడుగా పేర్కొంటు దేశ రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీ చీఫ్ జస్టిస్ వంటి ప్రముఖులు రోశయ్యను స్మరిస్తున్న వేళా .. తన తండ్రి వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన నాయకుడిని విస్మరించి, సందర్శించకపోవడం శోచనీయం.
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి రోశయ్య కారకుడా..?!
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత, కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఏపీ పాలన పగ్గాలను రోశయ్యకు అప్పగించారు. రాజశేఖరరెడ్డి మరణాంతరం జగన్.. సీఎం కావాలని చేసిన ప్రయత్నాలకు సోనియా నో అని చెప్పడం, ఆ తరువాత సీనియరిటీ బేస్ లో రోశయ్య ముఖ్యమంత్రి కావడం అనివార్యమైంది. దీనికి రోశయ్య మాత్రం ఏం చేస్తాడు. దీంతో మనస్తాపంతో జగన్ సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీతో, పార్టీ పెద్దలతో ఫైట్ చేశాడు. అంతేకాక నాడు జగన్ చర్యలకు విసిగిన వైఎస్ … ఆయనను దూరంగా పెట్టాడని, బెంగుళూరుకే పరిమితం చేశాడని రోశయ్య ఓ సందర్భంలో చెప్పాడం వంటివి మనసులో పెట్టుకున్న జగన్.. రోశయ్యపై కక్ష కట్టి టార్గెట్ చేశాడు. ముఖ్యమంత్రి పదవీ దక్కకుండా చేశాడని భావించి .. రోశయ్యపై, ఆయన ప్రభుత్వం పై సొంత మీడియాలో దుష్ప్రచారం చేయించాడు జగన్. దీంతో విసిగిన రోశయ్య .. రాజశేఖర రెడ్డి అనేకమార్లు జగన్ రెడ్డి మనస్తత్వానికి, చర్యలకు తలపట్టుకుని బాధపడేవారని పలుమార్లు మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇలా రోశయ్యకు, జగన్ కు బాగా గ్యాప్ పెరిగిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతుంటాయి.
ఈ కారణాలతోనే జగన్ రెడ్డి వెళ్లలేకపోయారా?
అలా ఆ సమయంలో రోశయ్యకు, జగన్ కు మధ్య పెరిగిన గ్యాప్ ను దృష్టిలో పెట్టుకుని రోశయ్య పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వెళ్లలేదన్నదే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అప్పటిలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అనేక విమర్శనాస్త్రలతో అసెంబ్లీలో ఉక్కిబిక్కిరి చేసిన రోశయ్య మరణించారని తెలిసిన వెంటనే ఆయన పార్థివ దేహాన్ని చంద్రబాబు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతి తెలియజేసి, ధైర్యం చెప్పారు. కానీ జగన్ మాత్రం తన తండ్రికి ఆత్మీయ బంధువుగా కొనసాగిన రోశయ్యకు తన ప్యాలెస్ లో చిన్న ఫోటో పెట్టి కూడా సంతాపం తెలియజేయకపోవడం గమనార్హం. ఏపీ ప్రభుత్వం కన్నా ముందుగా.. తెలంగాణ ప్రభుత్వం రోశయ్య మృతికి మూడు రోజులుపాటు సంతాప దినాలను ప్రకటించింది. ఆ తరువాత ఏపీ ప్రకటించింది. వరదలను సైతం పక్కన పెట్టి, తెలంగాణ నాయకుల ఇంట పెళ్లిలకు, తన కార్యాలయంలో పనిచేసే అధికారుల ఇంట జరిగే శుభాకార్యాలకు వెళ్లె జగన్ .. దేశం గర్వించతగ్గ ఆర్థికవేత్త మృతి చెందితే వెళ్లకపోవడంపై ఏమిటని.. రెండు తెలుగురాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. జగన్ అనుసరిస్తున్న తీరు, చర్యలు పలు విమర్శలకు కూడా తావిస్తున్నాయి.
Must Read ;- జగన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఏపీ ఉద్యోగులు..! దెబ్బకు అలర్టైనా పోలీసులు!!











