మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాది మే 9న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక చిరు తదుపరి చిత్రాల్ని కూడా వరుసగా పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన 153వ చిత్రం ఈ రోజే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ కు రీమేక్ వెర్షన్.
మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ మలయాళ మూవీ ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ ను పూర్తి రీమేక్ గా కాకుండా.. చిరు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్ర్కిప్ట్ లో చాలా మార్పులు చేశారు దర్శకుడు. ఆ విషయం ఆయనే స్వయంగా వివరించారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్, యన్.వి.ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకి ‘బైరెడ్డి’ అనే పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి.
సురేఖ కొణిదెల సమర్పణలో ఆర్బీ చౌదరి, యన్వీ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి లక్ష్మీ భూపాల రచన అందిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లో గ్రాండ్ గా లాంఛయిన లూసిఫర్ తెలుగు వెర్షన్.. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. ఇకఈ సినిమాలో నయనతార చిరుకి చెల్లెలి గా నటిస్తోందని తెలుస్తోంది. అలాగే.. మరో ముఖ్యపాత్రలో సత్యదేవ్ నటించబోతున్నాడట. మరి ఈ సినిమా చిరు ఇమేజ్ ను ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- ఈ ఏడాది చిరు 2 సినిమాలు రిలీజ్ చేయబోతున్నారా?