నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఒక్క మగాడు. ఈ చిత్రం 2008లో జనవరి 10న రిలీజైంది. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కించిన చిత్రం కృష్ణ. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని 2008లో జనవరి 11న రిలీజ్ చేశారు. బాలయ్య, రవితేజ సినిమాలు ఇలా ఒక రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి.
ఈ రెండు సినిమాల్లో రవితేజ కృష్ణ సక్సస్ సాధించగా, బాలయ్య ఒక్కమగాడు మూవీ డిజాస్టర్ అయ్యింది. అలాగే… ఆ తర్వాత బాలయ్య మిత్రుడు, రవితేజ కిక్ పోటీ పడగా.. అప్పుడు కూడా రవితేజ దే పై చేయి. అలాగే.. మరోసారి బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాకి రవితేజ మిరపకాయ్ దెబ్బకొట్టింది. ఇప్పుడు నాలుగో సారి బాలయ్య, రవితేజ సినిమాలు పోటీపడుతుండడం ఆసక్తి రేపుతోంది. ఈసారి ఒకేరోజు వీరిద్దరి సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బోయపాటితో కలిసి సింహా, లెజెండ్ చిత్రాలు చేయడం.. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో మూడవసారి కలిసి చేస్తున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని మే 28న రిలీజ్ చేయనున్నారు.
ఇక రవితేజ విషయానికి వస్తే.. రమేష్ వర్మతో చేస్తున్న మూవీ ఖిలాడి. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి.. ఈసారి పోటీలో బాలయ్య, రవితేజ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.
Must Read ;- చిరుతో పోటీకి సై అంటున్న బాలయ్య?











