తెలంగాణలో పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలను సెలబ్రిటీలు, ప్రముఖులు కలుస్తున్నారు. తాగాజా కాంగ్రెస్ పార్టీ నేత అజరుద్దీన్ తనయుడు అసద్, సానియా మీర్జా సోదరి ఆనం మీర్జాలు వైఎస్ షర్మిలతో భేటి అయ్యారు. శుక్రవారం లోటస్ పాండ్ లో షర్మిలను కలిసి పూలబొకే అందించారు. షర్మిలతో కొద్దిసేపు ముచ్చటించారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ అని, దీనికి రాజకీయ ప్రమేయం లేదని అసద్, ఆనం చెప్పారు. పార్టీ పెడుతున్న షర్మిలను కలుసుకునేందుకు చాలామంది సెలబ్రిటీలు లోటస్ పాండ్ కు క్యూ కడుతున్నారు. అయితే ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారా? రాజకీయంగా భేటీ అవుతున్నారా అనే విషయాలు కొద్దిరోజులు గడిస్తే కానీ బహిర్గతం కావు.
Also Read:- ఆర్థిక దన్నుతో ఫుల్ ఎఫర్ట్స్.. పక్కా ప్లానింగ్తో షర్మిల