బుల్లి తెరపై యాంకర్ గా వెలిగిపోతూనే.. వెండితెర మీద కూడా ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది అందాల అనసూయ. అదిరిపోయే డ్రెస్సులతోనూ, ఆకట్టుకొనే పోజులతోనూ అలరించడం ఆమెకు పరిపాటి. సోషల్ మీడియాలో భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న అనసూయ ఎలాంటి సందర్భం వచ్చినా దానికి తగ్గరీతిలో స్పందించడం ఆమె నైజం. ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టినా.. దానికి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇటీవల హైద్రాబాద్ లో వర్షాలు పడిన నేపథ్యంలో .. తన కుటుంబ సభ్యులతో కలిసి.. బైట కూర్చుండగా.. అనసూయ కొడుకు చేసిన పేపర్ బోట్ ను వర్షంలో వదిలిపెట్టి.. తానూ చిన్నపిల్లలా సంబరపడిపోయింది. కాజువల్ వేర్ తో అనసూయ వర్షంలో తడుస్తూ.. తన పిల్లలతో పడవను వదులుతూన్న ఈ వీడియో అభిమానుల్ని ఎంతగానో అలరిస్తోంది. దాంతో పాటు ఆమె పెంచుకుంటోన్న రామచిలుకకి ముద్దు పెట్టడం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం టీవీ రంగంతో పాటు, సినిమా రంగంలోనూ ఫుల్ బిజీగా ఉన్న అనసూయ .. టాప్ మోస్ట్ ప్రాజెక్టులైన ‘పుష్ప, రంగమార్తాండ, ఖిలాడీ’ లాంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తోంది. మరిన్ని ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన థాంక్యూ బ్రదర్ లోని ఆమె పాత్రకు మంచి పేరొచ్చింది. అలాగే.. పలు టీవీ షోస్ తోనూ బిజీగా ఉంది.
Must Read ;- ‘పుష్ప’లో గిరిజన మహిళగా రంగమ్మత్త?











