నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి ‘అఖండ’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన నటించే సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. ఆ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఆయన 107 సినిమాకి గతంలో వార్తలు వచ్చినట్టుగానే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించబోతున్నారు. సింహం బ్యాక్ డ్రాప్ తో ఉన్న పోస్టర్ మీద హంట్ స్టార్ట్స్ సూన్ అని కూడా మెన్షన్ చేశారు.
ఈ సంక్రాంతికి ‘క్రాక్’ మూవీతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని బాలయ్యకి ఓ పవర్ ఫుల్ స్టోరీ నెరేట్ చేసి.. ఆయన్ను బాగా ఇంప్రెస్ చేశారు. పల్నాడు బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ సూపర్ యాక్షన్ మూవీని తెరకెక్కించబోతున్నారు. అలాగే.. ఇందులో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
‘క్రాక్’ మూవీ తరహాలోనే ఈ సినిమాని కూడా గోపీచంద్ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. దీని కోసం ఆయన వేటపాలెంలో ఒక లైబ్రరీలో పరిశోధన కూడా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుబోతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటించబోతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. మరి గోపీచంద్ .. బాలయ్యను ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో చూడాలి.
Must Read ;- న్యూ లుక్ : అదిరిపోయిన ‘అఖండ’ రోరింగ్ ట్రీట్.. అభిమానులకు పండగే