మైనే ప్యార్ కియా (ప్రేమ పావురాలు) సినిమాతో దేశాన్నే ఊపేసిన అందాల కథానాయిక భాగ్యశ్రీ చేసిన షాకింగ్ కామెంట్ కు అందరూ ఆశ్చర్య పోయారు. భాగ్యశ్రీ ఎందుకిలా అంది? ప్రభాస్ ఏంచేశాడు? అన్న ఆసక్తి సహజం. అదేంటో తెలుసుకునే ముందు అసలు భాగ్యశ్రీ ఏంచేస్తోందో చూద్దాం. మొదటి సినిమాతోనే ఆమెకు ఓ ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చినప్పటికీ ఎక్కువగా సినిమాల్లో నటించకుండా పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇప్పుడు మళ్లీ నటన మీద ఆసక్తితో సినిమాలు చేస్తోంది. ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’లో భాగ్యశ్రీ నటిస్తోంది. ఇందులో ప్రభాస్ తల్లిగా ఆమె నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 30న రాధేశ్యామ్ మూవీని విడుదల చేయలి అనుకున్నారు అయితే.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటిస్తున్న భాగ్యశ్రీ.. ప్రభాస్ తనను నాశనం చేసేశాడు అంటూ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. ఎందుకిలా కామెంట్ చేసిందంటే.. హైదరాబాద్లో ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోందంటే.. యూనిట్లో ముఖ్యమైన నటీనటులు టెక్నీషియన్లందరికీ ప్రభాస్ ఇంటి నుంచి క్యారియర్లు వెళ్తుంటాయి. రకరకాల వంటకాలు తయారు చేయించి తీసుకొచ్చి అందరికీ కొసరి కొసరి వడ్డించడం ప్రభాస్ కు అలవాటు.
భాగ్యశ్రీకి కూడా ప్రభాస్ తనదైన స్టైల్ లో కొన్ని వంటకాల రుచి చూపించాడు. ముఖ్యంగా ఆమెకు ఆంధ్ర నుంచి రుచికరమైన పూత రేకులు తెప్పించి ఇచ్చాడు. ఇటీవల రాధేశ్యామ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. మళ్లీ షూటింగ్ వచ్చిన భాగ్యశ్రీకి మరోసారి పూత రేకుల బహుమతి అందించాడు. ప్రభాస్ ఇచ్చిన ఆ స్వీట్ బాక్సులను ట్విట్టర్లో షేర్ చేసింది. ఇవి చాలా రుచికరంగా ఉన్నాయని చెప్పింది. అంతే కాకుండా.. ప్రభాస్ తనను స్పాయిల్ చేసేశాడు అని వ్యాఖ్యానించింది. కారణం ఏంటంటే.. ఆమెకు యాభై ఏళ్లు అయినప్పటికీ మంచి ఫిట్నెస్ తో ఉంది. ఇప్పుడు ప్రభాస్ ఇచ్చిన స్వీట్స్ తిని ఫిట్నెస్ కోల్పోతానేమో అనే భయంతో ఇలా సరదాగా కామెంట్ చేసింది. అదీ.. సంగతి. మొత్తానికి బాలీవుడ్ కి మన ఆంధ్రా పూతరేకుల రుచి చూపించాడు ప్రభాస్.. శభాష్.
Must Read ;- ప్రభాస్ రాధేశ్యామ్ లో షాకింగ్ సీన్స్ ఉన్నాయట