Bheemla Nayak Adavi Thalli Song Creates Sensation
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఇందులో క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కూడా నటిస్తుండడంతో ఈ క్రేజీ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదలయ్యాయి. ఈ మూడు పాటలు ఒక పాటను మించి మరో పాట విశేషంగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ రోజు అడవి తల్లి మాట… అంటూ సాగే ఈ సినిమాకి సంబంధించిన నాలుగో పాటని రిలీజ్ చేశారు. ఇక ఈ పాట గురించి చెప్పాలంటే… కిందున్న మడుసులలా.. కోపాలు తెమలవు.. పైనున్న సామేమే కిమ్మని పలకడు.. అంటూ సాగిన ఈ పాట ఇలా రిలీజ్ చేశారో లేదో అలా ఆకట్టుకుంది. పాట రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Bheemla Nayak Adavi Thalli Song Creates Sensation
ఈ పాటకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అద్భుతమైన ట్యూన్ సమకూర్చారు. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యం అందించారు. ఈ పాటను జానపద గాయని కుమ్మరి దుర్గవ్వ మరియు సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ భీమ్లా నాయక్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ భారీ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Must Read ;- 350 కోట్లతో చరణ్, శంకర్ మూవీ రైట్స్ దక్కించుకున్న జీ సంస్థ











