ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమదైన శైలి వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉంటాయి. ఇందులో తమ బలం పెంచుకునేందుకు కొన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తే.. మరికొన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసే వ్యూహాలతో పాటు వైరివర్గాలను కన్ఫ్యూజన్ లో పడేసే ప్రణాళికలను రంగంలోకి వదులుతాయి. ఇప్పుడు తెలంగాణలో అందరి నోటా వినిపిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా.. ఇటు టీఆర్ఎస్ తో పాటు అటు బీజేపీ కూడా తమదైన శైలి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు బీజేపీ తన ప్రత్యర్థి టీఆర్ఎస్ ను కన్ఫ్యూజన్ చేయడంతో పాటుగా ఆత్మరక్షణలో పడేసే దిశగా ఓ స్టెప్ వేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాను చేయించినట్లుగా చెబుతున్న ఓ సర్వేను బీజేపీ వదిలింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలను చూస్తుంటే.. ఇలాంటి వ్యూహాలు కూడా అమలు చేస్తారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
సర్వేలో ఏం తేలిందంటే..?
హుజూరాబాద్ లో చేయించిన సర్వేలో తేలిన అంశాల విషయానికి వస్తే.. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మొత్తం ఓట్లలో 52 శాతం నుంచి 54 శాతం ఓట్లు పడతాయట. అదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు కేవలం 38 శాతం నుంచి 40 శాతం ఓట్లు మాత్రమే వస్తాయట. అంటే.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హీనపక్షం 10 శాతం ఓట్లతో విజయం సాధిస్తారట. ఇక ఈటలకు పడే ఓట్లలో బీసీ ఓట్లతో పాటు యువత ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకుంటుందట. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లలోనూ 30 శాతం ఈటలకే పడతాయట. ఇక టీఆర్ఎస్ కు పడే ఓట్ల విషయానికి వస్తే.. దళిత ఓట్లను గంపగుత్తగా సాధించే అధికార పార్టీకి అగ్ర వర్ణాల ఓట్లనూ క్లీన్ స్వీప్ చేస్తుందట. ఇక 30 శాతం ఓట్లు పోగా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 70 శాతం ఓట్లు కూడా టీఆర్ఎస్కే పడతాయట. ఎలా చూసినా.. ఈటల ఘన విజయం సాధిస్తారని బీజేపీ సర్వే తేల్చేసింది.
లాజిక్ మిస్సైందే..
ఏ పార్టీ చేయించుకున్న సర్వే అయినా ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది తప్పించి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుస్తారని ఎలా చెబుతుంది. ఒక వేళ సర్వే చేయించుకున్న పార్టీ అభ్యర్థి ఓడిపోతారని తేలితే.. అసలు ఆ సర్వేనే బయటకు రాదు కదా. మరి ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికపై బీజేపీ చేయించిన సర్వేలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఎలా గెలుస్తారు? ఈ చిన్న లాజిక్ ను మరిచిపోయిన బీజేపీ.. తాను చేయించుకున్న సర్వే అంటూ ఓ సర్వేను కొన్ని వర్గాల ద్వారా విడుదల చేయించడాన్ని ఏమనాలన్న వాదన వినిపిస్తోంది.
Must Read ;- కమాన్ బండి.. కేటీఆర్ రిజైన్ చేస్తారట