దేశ ప్రజలు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న రోజుకు సంబంధించిన అధికారక ప్రకటన రానే వచ్చింది. కరోనా మహమ్మారికి కాలం చెల్లె రోజులు దగ్గరపడ్డాయి. దేశమంతా రెండు విడతల డ్రై రన్ నిర్వహించి ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి ముహుర్తం ఖరారు చేసింది. ఈ నెల 16వ తేదీ నుండి వ్యాక్సినేషన్ అందించనున్నట్లు ప్రభత్వం తెలిపింది. వ్యాక్సిన్ని ముందుగా వైద్యరంగంలోని వారికి ఇవ్వబోతున్నట్లు తెలపింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపు 3 కోట్ల మంది వైద్యులు, మెడికల్ స్టాఫ్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వీరు ప్రత్యేకంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిన పనిలేదు. వీళ్లకు సంబంధించిన వివరాలను ప్రభత్వమే సిద్ధం చేస్తుంది.
వ్యాక్సినేషన్ సంబంధించి సన్నాహాల గురించి, సోమ వారం ప్రధాన మంత్రి మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నట్లు తెలుస్తుంది. వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. రాష్ట్రాలు చేస్తున్న ఏర్పాట్లు గురించి తెలుసుకుని, కేంద్రం తరపున సూచనలు అందించబోతున్నారు. ప్రపంచంలోనే, భారతదేశంలో జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా పెద్దదని మోడీ మునుపు ప్రసంగించిన ప్రచారాల్లో అభిప్రాయపడిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ గురించిన సూచనలు, జాగ్రత్తలు చెప్పడంతోపాటు.. వారి నుంచి సమాచరం అడిగి తెలుసుకోనున్నారు.
వ్యాక్సినేషన్ విషయంలో ఏ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయనున్నారు. వ్యాక్సిన్ అందించన తర్వాత వారి ఆరోగ్యాన్ని గమనించి నివేదికలు సిద్దం చేయాల్సిందిగా కూడా తెలియజేయనున్నారు. వ్యాక్సినేషన్ ప్రణాళిక విషయంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదని కేంద్రం భావిస్తుంది. అందుకే రాష్ట్రాలన్నింటినీ సమన్వయపరచి ప్రణాళిక సిద్ధం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.
Must Read ;- కొవ్యాక్సిన్, కొవిషీల్డ్లకు డిసిజిఐ ‘గ్రీన్ సిగ్నల్’