హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు, వాటికి సంబంధించి నిందితులుగా అనుమానిస్తూ పోలీసులు ఎవరో ఒకరిని అరెస్టు చేస్తుండడం ఇలాంటి వ్యవహారాలపై చంద్రబాబునాయుడు నిశిత విమర్శలు చేశారు. కిరాణాషాపు నడుపుకుంటున్న వృద్ధుడిని, ఆయన కొడుకును కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని హింసించడాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు.
‘ఎవరో ఒకర్ని అదుపులోకి తీసుకుని, వారిమీద తెలుగుదేశం ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారా’ అంటూ చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. ఈ అరెస్టులపై చంద్రబాబునాయుడు చేసిన వరుస ట్వీట్లు ఇలా ఉన్నాయి.
చంద్రబాబు వరుస ట్వీట్లు :
నర్సీపట్నం, గొలుగొండ మండలం, ఏటిగైరంపేట రామాలయం ఘటనలో.. గుడి ఎదురుగా కిరాణా షాపు నడుపుకుంటూ, భక్తితో ఆలయ నిర్వహణ చూస్తున్న ఆర్యవైశ్యులు 69 ఏళ్ళ పోలిశెట్టి కనకరాజు, పోలిశెట్టి సంతోష్ లను పోలీసు స్టేషనులో నిర్బంధించి హింసించడం దారుణం.
ఆఖరికి ఆలయ పూజారి పేరు కూడా FIRలో చేర్చడం హేయమైన చర్య. వైసీపీ పాలనలో సుమారు 140 ఆలయాలపై ఇన్ని నెలలుగా దాడులు జరుగుతున్నా దోషులను పట్టుకోవడం చేతకాని వాళ్ళు.. ఇప్పుడు ఇలా అమాయకులని, వృద్ధులను వారాంతపు సెలవులని తెలిసికూడా స్టేషన్లో పెట్టి వేధిస్తున్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా?
పైగా వాళ్ళ మీద తెలుగుదేశం కార్యకర్తలు అని ముద్ర వేసి విషప్రచారం చేస్తున్నారు. ఇదే ఘటనతో సంబంధముందని చెబుతున్న మరో వ్యక్తి వైసీపీ నాయకులతో ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. అలాంటప్పుడు అతనిచేత వైసీపీ నేతలే కావాలని ఇదంతా చేయిస్తున్నారని మేము కూడా అనాలా?
చేతనయితే దేవాలయాలపై దాడుల్ని ఆపండి. అంతేకాని ఇలా అమాయకులని కేసుల్లో ఇరికించి హింసించకండి. ఇది క్షమించరాని మహాపాపం.
Must Read ;- చినజీయర్ యాత్ర.. వైసీపీకి పెద్ద టెన్షన్











