సంగం డెయిరీ వ్యవహారంలో అరెస్టై రిమాండులో ఉన్నఆ సంస్థ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర,ఎండీ గోపాలకృష్ణ బెయిల్పై విడుదలయ్యారు.రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగానే కరోనా బారినపడ్డ దూళిపాళ్ల నరేంద్ర,ఆ సంస్థ ఎండీ గోపాలకృష్ణలకు కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు.రాజమండ్రి డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దూళిపాళ్ల నరేంద్రను రాజమండ్రి జైలుకు తరలించి,అక్కడ జైలు నిబంధనలు పూర్తి చేసి కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేసినట్టు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు ప్రకటించారు.ఇక సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించి,అక్కడ జైలు నిబంధనలు పూర్తి చేసిన అనంతరం విడుదల చేశారు.
షరతులు వర్తిస్తాయి..
కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర నెల రోజుల పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలోనే ఉండాల్సి ఉంది.ఏసీబీ విచారణకు 24 గంటల ముందే నరేంద్రకు సమాచారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.దీంతో దూళిపాళ్ల నరేంద్ర విజయవాడలోని తన నివాసానికి చేరుకున్నారు.నెల రోజుల తరవాత బెయిల్ పై బయటకు వచ్చిన దూళిపాళ్ల నరేంద్రను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ చేసి పరామర్శించారు.అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని,పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా కల్పించారు.
Must Read ;- అక్రమ అరెస్టులతో అరాచకం.. దూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన లోకేష్