టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా దిల్ రాజు తన పుట్టినరోజు వేడుకలను నిన్న హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యువ సమ్రాట్ నాగచైతన్య, సమంత, క్యూట్ స్టార్ నితిన్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు మీడియాకి కూడా స్పెషల్ గా పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 50వ పుట్టినరోజును స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకోవడానికి ఓ రీజన్ ఉంది.
అది ఏంటంటే.. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాను. సెకండ్ లైఫ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిర్మించాను. సక్సస్, ఫ్లాపులు డబ్బు, ఫేమూ అంతా చూసాను. ఇప్పుడు సమాజానికి ఏదైనా చేయాలి అనుకుంటున్నాను. అందుకని ఎవరైనా డబ్బులు లేక చదువుకోలేకపోయిన వాళ్లకి, అలాగే హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్లకి సహాయం చేయాలనుకుంటున్నాను. అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్లు నన్ను కాంటాక్ట్ చేయచ్చు అని తెలియచేసారు. ఇది పేరు కోసం చేయడం లేదు. ఆపదలో ఉన్న వాళ్లకి సహాయం చేయాలనే మంచి ఉద్దేశ్యంతో చేయాలనుకుంటున్నాను అని తెలియచేసారు.
దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు మంచి నిర్ణయం అంటూ మనస్పూర్తిగా అభినందిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్, నాగచైతన్యతో థ్యాంక్యూ, వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో ఎఫ్ 3 సినిమాలు ని్ర్మిస్తున్నారు. ఈ సినిమాలు కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Must Read ;- దర్శకేంద్రుడుడి మాజీ కోడలు రెండో పెళ్లి. ఇంతకీ ఎవరితో.?