గన్ కంటే ముందు జ‘గన్’ వస్తాడు.. ఈ డైలాగ్ అన్నది ఎవరో కాదు.. అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ మహిళా నేత మహిళలకు రక్షణకు సంబంధించి అన్న పవర్ ఫుల్ డైలాగ్ ఇది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నిందితులు అధికార పార్టీకి చెందిన వారైతే కనీసం కేసులు కూడా నమోదు చేసుకోవడం లేదు పోలీసులు. ఇలాంటి సంఘటన ఒకటి అనంతపురంలో వెలుగుచూసింది. బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న వీడియో వైరల్ కావడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది.
దారుణమైన ఘటన
అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లికి చెందిన మైనర్ బాలికపై కురువ ఆది నారాయణ అనే ఒక లారీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి అదే ప్రాంతానికి చెందిన ఆరవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయం బాధితురాలు తల్లిదండ్రలకు చెప్పడంతో, వారు బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ నిందుతుడికి అధికారపార్టీ యంపీ అండదండలు ఉండడంతో ఏకంగా యంపీ గారే పోలీసలకు ఫోన్ చేసి మరీ కేసు తేలిగ్గా తీసుకోమని చెప్పడంతో.. పోలీసులు నామమాత్రం సెక్షన్లు పెట్ట్ కేసు నమోదు చేసి ఒక్కరోజులో బెయిల్ వచ్చేలా చేశారు.
Also Read ;- దిశ చట్టం అమలులో వైసీపీ ప్రభుత్వం విఫలం
ధర్నాకు దిగిన ప్రజలు
ఈ వ్యవహారమంతా తెలుసుకున్న మైనర్ బాలిక కుటుంబసభ్యులు, బంధువులు, ఊరి జనం తోడుగా పోలీస్ స్టేషన్ చేరకుని ధర్నాకు దిగారు. నిందుతుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం అత్యంత క్రూరమైన చర్యని, అటువంటి దానికి పోలీసులెలా అండగా నిలుస్తారని పోలీసులను స్థానికులు నిలదీశారు. నిందితుడు అధికార పార్టీ వ్యక్తి కావడం వల్లే పోలీసులు అతడిని కాపాడి కేసు నుంచి తప్పించే యత్నం చేస్తున్నారని బాధితులు విలపించారు.
‘అధికార’ న్యాయం
అధికార పక్షం అయితే చాలు ఎలాంటి దారుణాలైనా చేసి చాలా సులభంగా తప్పించుకోవచ్చనడానికి ఈ సంఘటన తార్కాణంగా నిలుస్తుంది. రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సరే గన్లా దూసుకొస్తానన్న జగన్, ఇంతకీ నిందులను కాపాడడానికి లేదా శిక్షించడానికా అనే అనుమానులు రేకెత్తుతున్నాయి. దిశ చట్టంతో మహిళలకు అత్యుత్తమ రక్షణ కల్పిస్తాం అంటూ బీరాలు పలికిన ప్రభుత్వం చివరికి గత అసెంబ్లీ సభలో సవరణల పేరుతో కోరలు పీకేసిన పాముని చేసింది ‘దిశ’ చట్టాన్ని. దాని వల్ల కొత్తగా కలిగే ప్రయోజనాలేమీ లేకుండా చేసింది. నిర్భయ చట్టానికి లోబడే రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు ఉండాలని కేంద్రం దిశను తిరస్కరించడంతో మారు మాట్లాడకుండా తమకున్న అధిక్య బలంతో బిల్ పాస్ చేసి కేంద్ర ఆమోదానికి పంపిన ఈ ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో ఎంత నిబద్ధత పాటిస్తుందో చెప్పకుండానే చెప్పింది. ఇక తాజా సంఘటన చూస్తే.. దారుణమనే మాట కూడా చిన్నదనే చెప్పాలి. మరి అధికార గణం స్పందింస్తుందో లేదా ఇలాగే అన్యాయం చేస్తుందో చూడాలి.
Must Read ;- వైసీపీ నేత బెదిరింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం..