ఒకప్పుడు తెలుగులోనే కాకుండా హిందీలోనూ ఎన్నో హిట్ సినిమాలు తీసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. అప్పటి హీరోల నుండి ఇప్పటి హీరోల వరకు అంటే మూడు తరాల హీరోలతో అనేక సినిమాలు తీశారు రాఘవేంద్రరావు. గత కొన్ని దశాబ్దాల నుండి తెర వెనుక ఉంది ఎన్నో హిట్ సినిమాలు అందించిన రాఘవేంద్రరావు తొలిసారిగా ఒక సినిమాతో తెరముందుకు రాబోతున్నారని మొన్నీ మధ్యే ఒక వార్త వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్లు నటించనున్నారట. ఇప్పటికే రమ్యకృష్ణ, సమంత, శ్రీయను ఫైనల్ చేసిన చిత్ర బృందం నాలుగో హీరోయిన్ను వెతికే పనిలో ఉందని తెలుస్తోంది. అయితే నాలుగో హీరోయిన్ గా ఒక కొత్త ముఖాన్ని పరిచయం చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నారని సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ కథా రచయిత జనార్థన మహర్షి కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా చేయబోతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడిగా స్వరాలను సమకూరుస్తున్నారట.
వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎట్టిపరిస్థితిల్లో సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొద్ది రోజాలు ఆగాల్సిందే.
Must Read ;- చరణ్ కు జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. !











