జీహెచ్ఎంసీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా పార్టీల మధ్య, నేతల మధ్య స్పీడ్ పెరిగిపోయింది. నేతల మధ్య విమర్శల స్థాయి కూడా పెరిగిపోయింది. దుబ్బాక సీనే గ్రేటర్ ఎన్నికల్లోనూ కనబడుతోంది. ప్రధానమైన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే జరుగుతోంది. ఈనేపథ్యంలోనే రెండు పార్టీల నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి.
బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రచార సభను ప్లాన్ చేసింది. ఈ సభా వేదిక నుంచి సీఎం కేసీఆర్.. ప్రజలు, పార్టీ శ్రేణులను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. అయితే ఈ సభకు సంబంధించి విజయశాంతి పలు సెటైర్లు విసిరారు.
‘జీహెచ్ఎంసీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సవినయ మనవి. రేపటి కేసీఆర్ గారి ఎన్నికల ప్రచార బహిరంగ సభ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దొరగారిని ఒక్కసారి చూసుకోండ్రి. మల్లా ఇంక ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే వారు కనబడేది, వినబడేది అసాధ్యం.’
జీహెచ్ఎంసీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సవినయ మనవి… రేపటి కేసీఆర్ గారి ఎన్నికల ప్రచార బహిరంగ సభ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దొరగారిని ఒక్కసారి చూసుకోండ్రి. మల్లా ఇంక ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే వారు కనబడేది, వినబడేది అసాధ్యం.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 27, 2020
Must Read ;- సీఎం కేసీఆర్ ఎంట్రీ వెనుకాల అసలు కారణమేంటీ?
‘ప్రజలు ఇప్పుడున్న కష్టాలకు సీఎం గారి కామెడీ వాగ్ధానాల ద్వారా ఏదో కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉండవచ్చు. హమీల అమలు ఎప్పటిలాగే ఏమీ ఉండదని మనందరికీ ఎప్పుడూ తెలిసిన కార్యక్రమమే…’ అని విజయశాంతి సోషల్ మీడియాలో సెటైర్లు విసిరారు.
ప్రజలు ఇప్పుడున్న కష్టాలకు సీఎం గారి కామెడీ వాగ్దానాల ద్వారా ఏదో కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉండవచ్చు. హామీల అమలు ఎప్పటిలాగే ఏమీ ఉండదని మనందరికీ ఎప్పుడూ తెలిసిన కార్యక్రమమే…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 27, 2020
Also Read ;- కేసీఆర్పై స్వరం మార్చిన ప్రజా యుద్ధనౌక.. గద్దర్!











