ఈటల రాజేందర్ ఓ రాజకీయ క్రీడలో పావుగా మారి బలైపోయారా? అధికార పోలేరమ్మకు ఈటల మేకను బలి ఇచ్చాకే.. ఆయనకు వరం దక్కిందా? ఇక్కడ నిజంగానే పొట్టోడిని పొడుగోడు కొట్టాడా? ఆ పొడుగోడు తనను పోచమ్మ కొట్టకుండా ఉండటానికే ఈ పని చేశాడా? ఇవే ఇప్పుడు రేవంత్రెడ్డి ట్వీట్ పుట్టిస్తున్నహీట్ ఈక్వేషన్స్.ఈటల రాజేందర్ ఎగ్జిట్ వెనక ఆయన నమ్ముకున్ననేత ప్లాన్ ఉందని.. అందుకే ఇప్పుడు ఆయనకు కేసీఆర్ దగ్గర గ్రాండ్ ఎంట్రీ దొరుకుతోందని చెప్పుకుంటున్నారు. హంపి చేసిన యవ్వారం..రసమయమైన గానం..సీనియర్ మంత్రి వ్యూహం..అన్నీకలిస్తే ఈటల అవుట్. ఆ తర్వాత వికెట్ సూర్యాపేట బాస్ అని రేవంత్ ట్వీట్ సారాంశం. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో కాక రేపుతోంది.
రిమార్క్ చెరిపేసుకోవడానికి..
ఇంతకీ ఎవరాయన?ఆయన కూడా కేసీఆర్పై అసంతృప్తిగా ఉన్నాడని ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో కాస్త వాస్తవం కూడా ఉంది. ఆ రిమార్క్ చెరిపేసుకోవడానికి మరొకరి గీత మార్చేశాడనేదే ఇప్పుడు అసలు కథ. ఇంతకీ అసలు కథలోకి వెళదాం. అనగనగా కర్నాటక..అక్కడ హంపి అనే ఊరు. ఆ ఊరిలో ఓ పార్టీ. ఆ పార్టీ పెట్టింది మన గులాబీ మంత్రియే. పార్టీకి హాజరయింది కూడా కొందరు గులాబీ ఎమ్మెల్యేలే. వీరంతా కల్వకుంట్ల చంద్రుడు కాదని సూర్యుడని.. ఆ నిప్పులకు కాలిపోతున్నామని ఆవేదన ఒకరికొకరు చెప్పుకున్నారు. కొన్ని చుక్కలు గొంతులోంచి దిగాక..అది శృతి మించిందంట. చంద్రుడు పోయి రాముడొస్తే ఇంకెంత ఘోరంగా ఉంటుందోనని ఓ పాటల ఎమ్మెల్యే పాట పాడాడంట. ఇక ఆ పార్టీ అయిపోయింది.
Must Read ;- ఎంపీ రేవంత్ సంచలన ట్వీట్ : యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా..? అంటూ సెటైర్

రాముడు అదే పాటను వినిపించడంతో..
కాని రాముడు అదే పాటను ఆ పాటల ఎమ్మెల్యేకి వినిపించాడంట. ఇది విని మనోడికి గుండి ఆగిపోయినంత పనైంది. కాళ్లు పట్టుకుని బతిమాలాడుకుని క్షమించేశాను పో అనేదాకా వదల్లేదట. ఈ సంగతంతా ఒకడు వెళ్లి ఓ సీనియర్ మంత్రి.. అదే అసంతృప్తిగా ఉన్నాడని పేరు పడ్డ మంత్రికి చెప్పాడంట. ఇక తన రాత మార్చుకోవాలంటే..వాడెవడో మోసుకొచ్చిన వార్త వాడుకోవాలని..దానితో కొందరికి వాతలు పెట్టిస్తే.. ఇక పూర్వ వైభవం తనకు వచ్చేస్తుందని ప్లాన్ వేసుకుని…ఎకాఎకిన చంద్రుడి దగ్గరకు పోయాడట. పార్టీలో థూమ్ థామ్ సంగతులన్నీ చెప్పి.. పెద్దకుట్ర జరుగుతోందని ఈటల పార్టీ పెడతాడని..వీళ్లంతా అందులో చేరాలనుకుంటున్నారని..వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పాడంట.. దాంతో ఈటలపై వేటుకు వ్యూహం,రంగం,ఆచరణ అన్నీసిద్ధమైపోవడం… అమలు కావడం జరిగిపోయాయట.
మందు పార్టీ పెట్టిన మంత్రిపైనే తర్వాత గురి..?
ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని.. ఎవరిని చూసి ఎమోషనల్గా ఫీలై.. మనసులో అసంతృప్తి పెంచుకున్నాడో ఈటల.. ఆ మనిషే తన ఎమోషన్తో ఆడుకున్నాడన్న విషయం తెలుసుకోలేకపోయాడని..రాజకీయ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు అసలు మందు పార్టీ పెట్టిన మంత్రిపైనే తర్వాత గురి అంటూ న్యూస్ రావడంతో..వ్యవహారం మళ్లీ వేడెక్కిపోయింది. దీంతో ఇప్పుడు ఎవరు ఎటువైపు… ఎవరు ఎవరి వైపో లెక్కలేసుకుంటూ గులాబీ కార్యకర్తలు బిజీ అయిపోయారు.
Must Read ;- హుజూరాబాద్లో ఇక కురుక్షేత్రమే.. కేసీఆర్కు బుద్ధి చెబుతాం: ఈటల రాజేందర్











