హైదరాబాదీలైన టబు గతంలో బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే నేటి హీరోయిన్ అదితీరావు హైదరీ సైతం తెలుగు, హిందీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలియంది కాదు. ఆ కోవలో అమ్రిన్ ఖురేషి కూడా ముంబై, హైదరాబాద్ ల మధ్య ప్రయాణం సాగిస్తూ రెండు భాషల చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటోంది. తొలుత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అక్కడ ఒకేసారి రెండు చిత్రాలలో నటిస్తుండటం ఓ విశేషం.
తెలుగులో విజయం సాధించిన `’సినిమా చూపిస్తమావ” చిత్రాన్ని ‘బ్యాడ్బాయ్’ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. దీనిద్వారా ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా పరిచయమవుతుండగా, అమ్రిన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజ్కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తెలుగులో విజయవంతమైన “జులాయి`’ రీమేక్లో కూడా అమ్రిన్ హీరోయిన్గా నటిస్తోంది.
“బ్యాడ్ బాయ్;; చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. ఓ పాటను చిత్రీకరించిన సందర్భంగా అమ్రిన్ తన కెరీర్ గురించి ఇలా చెప్పుకొచ్చింది. “నేను హైదరాబాద్ అమ్మాయిని. ఈ ఏడాదిలో నేను హీరోయిన్ అయ్యాను. కొత్తగా తెలుగు, తమిళ, మలయాళ సినీరంగాల నుంచి అవకాశాలు వస్తున్నాయి. త్వరలో రానున్న నూతన ఏడాది కూడా నాకూ కెరీర్ పరంగా మరింత బావుంటుందని భావిస్తున్నాను“ అని వివరించింది.
Must Read ;- ‘ఎఫ్ 3’లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరా ముద్దుగుమ్మలు?