స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాప్ మూవీస్ లిస్ట్ లో జులాయి ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘జులాయి’ సినిమాను హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో హిరోయిన్ గా ఇలియానా నటించింది. 2012వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో బన్నీ టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఫుల్ లెంత్ కామెడీగా సాగే ఈ సినిమాకు త్రివిక్రమ్ రాసిన మాటలే ప్రధాన బలం అని చెప్పాలి. టాలీవుడ్ లోనే కాకుండా మలయాళం కూడా ‘జులాయి’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
దర్శకుడు త్రివిక్రమ్ కథను మలిచిన తీరు అద్బుతమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. టాలీవుడ్ లో ఇంతటి ఘన విజయం సాధించిన ‘జులాయి’ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ టోని డిసౌజ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నాడు. టాలీవుడ్ లో వచ్చిన ‘జులాయి’ కథను బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చారని సమాచారం.
ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నదని బాలీవుడ్ వర్గాల తెలిపాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి చేసారని తెలుస్తోంది. త్వరలోనే మీడియా ముఖంగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను దర్శకనిర్మాతలు తెలుపబోతున్నారు. తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ‘జులాయి’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Must Read ;- మారేడుమిల్లి అడవుల్లో గుబాళిస్తోన్న ‘పుష్ప’