దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు.ఇప్పటికే దేశంలో 21 కోట్ల టీకాలు వేశారు.అసలు వ్యాక్సిన్లు ఎంత వరకు పనిచేస్తున్నాయనే దానిపై భారత వైద్య మండలి(ఐసీఎంఆర్) క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్దమైంది.ఇప్పటికే కోవాగ్జిన్,కోవీషీల్డ్ టీకాలు తీసుకున్న5 వేల మంది సమాచారాన్ని సేకరించారు. సేకరించిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేషిస్తున్నారు.ఇప్పటి వరకు కేవలం ప్రయోగ ఫలితాలను మాత్రమే అంచనా వేశారు.ఇప్పటి నుంచి టీకాలు తీసుకున్న వారి నుంచి వాస్తవ సమాచారం రాబడుతున్నారు.వాక్సిన్ ఎలా పనిచేస్తోంది. దాని ప్రభావాలు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు ఐసీఎంఆర్ ప్రయత్నాలు ప్రారంభించింది.జూన్ మొదటి వారం నుంచి ఐసీఎంఆర్ టీకాల ప్రభావాలు అంచనా వేయనుంది.
ఆ రెండిండిపైనే..
మన దేశంలోనే తయారైన కోవాగ్జిన్,కోవీషీల్డ్ వాక్సిన్లు తీసుకున్న వారిపై ఐసీఎంఆర్ పరిశీలన జరపనుంది.ఇప్పటికే దేశంలో 21 కోట్ల టీకాలు ఇచ్చారు.ఇందులో 80 శాతం కోవీషీల్డ్ కాగా,20 శాతం కోవాగ్జిన్ టీకాలు వేశారు.ఈ రెండు టీకాలు తీసుకున్న వారిలో వైరస్ వల్ల కలిగే ప్రభావాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయా లేదా అనే విషయాన్ని ఐసీఎంఆర్ తేల్చనుంది.మొదటి డోసు తీసుకున్న వారిలో ప్రభావం ఎలా ఉంది.రెండు డోసులు తీసుకున్న వారిలో ప్రభావం ఎలా ఉంది అనేది కూడా అంచనా వేయనున్నారు.బి.1.617 వేరియంట్పై కోవాగ్జిన్ 60 శాతం ప్రభావం చూపించిందని బ్రిటన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఇదే విధంగా ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేయనుంది.
Must Read ;- ఇళ్ల వద్దే కరోనా పరీక్షలు: ఐసీఎంఆర్











