రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లోకి తారాజువ్వలా దూసుకువచ్చిన కథానాయిక. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ.. ఇలా వరుసగా స్టార్ హీరోల సరసన నటించే చాన్స్ దక్కించుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. నాగచైతన్య, బెల్లంకొండ సాయిశ్రీనివాస్.. ఇలా యంగ్ హీరోల సరసన నటించింది. అలాగే నాగార్జున, రవితేజ తదితర సీనియర్ హీరోల సరసన నటించింది. అయితే.. ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు తగ్గాయి. ఇలా.. అవకాశాలు తగ్గాయి అంటే రకుల్ కి కోపం వస్తుంది.
ఇటీవల కాలంలో రకుల్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా భారీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. అందుకే టాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చినా సినిమాలు చేయడానికి కుదరడం లేదు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ లో ఓ బిగ్ ఆఫర్ అందుకుందని వార్తలు వస్తున్నాయి. అది ఏంటంటే.. నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన నటించే అవకాశం. ఈ మూవీలో నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ ఓకే చెప్పిందట. ఇంతకీ.. ఏ సినిమాలో అంటే.. బాలయ్య శ్రీవాస్ కాంబినేషన్ లో రూపొందే సినిమాలో అని సమాచారం. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ తో బాలయ్య సినిమా చేయనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య, శ్రీవాస్ తో సినిమా చేయనున్నారు. ఇందులో కధానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ను కన్ ఫర్మ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు శ్రీవాస్ తెరకెక్కించిన లౌక్యం సినిమాతో రకుల్ హిట్ అందుకుంది. ఆ పరిచయం కూడా ఒక కారణమని అంటున్నారు. మరి.. ఇదే కనుక నిజమైతే.. రకుల్ ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి.
Must Read ;- రకుల్ కోపంపై నీళ్లు చల్లిన హరీష్ శంకర్