నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరుపెట్టని ఈ సినిమా షూటింగ్ కు లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. తిరిగి ఈమధ్యనే ప్రారంభం అయిన షూటింగ్ లో ఇంతవరకు బాలకృష్ణ జాయిన్ అవ్వలేదు. ఇప్పటికే ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లను ఫైనల్ చేశాడు బోయపాటి. అందులో ఒకరు ‘అఖిల్’ ఫేమ్ ఫెమ్ సాయేషా సైగల్, మరోక హీరోయిన్ ‘కంచె’ ఫెమ్ ప్రగ్యా జైశ్వాల్. వీరిద్దరిని ఫైనల్ చేసినట్లు ఇటీవలే చిత్ర బృందం కూడా ప్రకటించింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి సాయేషా సైగల్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా తను నటించవలసిన సినిమాలు మధ్యలోనే నిలిచిపోయాయని, అవి ఇప్పుడు మొదలవడంతో డేట్స్ కుదరక ఆమె తప్పుకుందని సమాచారం. వెంటనే సాయేషా సైగల్ స్థానంలో మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు చిత్ర బృందం. ఈరోజు రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతున్న షూటింగ్ కు బాలయ్యతో పాటు ప్రగ్యా జైశ్వాల్ ఒక్కరే నటిస్తున్నారని సమాచారం. వారి మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో బాలకృష్ణ పక్కా మాస్ గెటప్ లో కనిపించి అభిమానుల్ని ఖుషీ చేశారు. బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు ‘సింహ’, ‘లెజండ్’ వంటి సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఈ సినిమాతో హ్యాట్రిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అందులో ఒక పాత్రలో బాలయ్య అఘోరగా కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. మరి ఈ రెండు పాత్రలతోనూ బాలయ్య ఏ రేంజ్ లో అదరగొడతారో చూడాలి.
Must Read ;- బాలకృష్ణ కొట్టారు అన్న కామెంట్స్ పై సెహరీ హీరో వివరణ