మేజర్ పోర్టుగా ఉన్న రామాయపట్నం పోర్టు స్థాయికి తగ్గించడంతో కేంద్రం నిధులు ఇయ్యలేమని చెప్పింది. అప్పటికే అరబిందో రియాల్టీకి ఆ పోర్టు కార్యకలాపాలను అప్పజెప్పారు. ఇక్కడే తమ జగనన్న పాలనలో ఏదో జరుగుతోందనే చర్చ వైసీపీ శ్రేణుల్లోనే మొదలైంది. ప్రతిపక్షాలు ఎలాగూ విమర్శలు చేస్తాయి. అయితే తాజాగా ఇలాంటి విమర్శలు క్షేత్రస్థాయిలో వైసీపీ నుంచే వస్తున్నాయి. ఇక కాకినాడ సెజ్ని అరబిందోకు అప్పజెప్పడం వెనుక భారీ కుట్ర ఉందనే చర్చ కూడా నడుస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి.. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని అరబిందో సంస్థకు అప్పజెప్పారని విమర్శలూ వస్తున్నాయి.
అరబిందోకు జగన్ సర్కారు పలు కాంట్రాక్టులు..
ఇప్పటికే విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి భాగస్వామిగా ఉన్న అరబిందో ఫార్మాకు జగన్ సర్కారు పలు కాంట్రాక్టులు, బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. 108వాహనాల కొనుగోళ్లు కూడా అదే సంస్థకు ఇవ్వడం, రామాయపట్నం మేజర్ పోర్టు హోదాను తగ్గించి ఆ కంపెనీకే ఇవ్వడం ఇప్పటికే జరిగాయి. రామాయపట్నం మేజర్ పోర్టు హోదా లేని కారణంగా తాము నిధులు ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిన విషయం కూడా తెలిసిందే. ఇక్కడే పలు విమర్శలు వచ్చాయి. కేంద్రం నిధులు ఇవ్వకపోవడమే మంచిదని, ఇక వేళ నిధులు ఇస్తే.. లెక్కలు అడుగుతారని, అదే పోర్టు స్థాయిని తగ్గిస్తే రాష్ట్ర పరిధిలోనే అన్ని అంశాలుంటాయనే కుట్రతోనే జగన్ సర్కారు ఇలా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. అవి చాలదన్నట్లు.. కాకినాడ సెజ్ను కూడా అదే కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా అప్పజెప్పిందని ఆరోపణలు మొదలయ్యాయి.
Must Read ;- విశాఖ స్టీల్, పోలవరంపై సెల్ప్ గోల్.. వైసీపీ పవర్ ఫుల్ డ్రామా
- ఇటీవలివరకు 51 శాతం వాటా కలిగి ఉన్న ఆ సంస్థ మొత్తంగా 99.74శాతం వాటాను కొనుగోలుచేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ అర్థరాత్రి జీఓ జారీచేయడంపైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు.. సెజ్లో నిర్మించనున్న గేట్వే పోర్టులోనూ 74శాతం వాటాను అరబిందోకు బదిలీ చేసే డీల్కూ పచ్చజెండా ఊపింది. ఇక్కడే అనేక సందేహాలు వస్తున్నాయి.
- పదివేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెజ్ దేశంలోనే పెద్దదని చెబుతారు. గతంలో 51 శాతం వాటా GMRకి ఉండగా, అలాగే కాకినాడ డీప్ వాటర్ పోర్టు నిర్వహణదారైన కేవీ రావుకి చెందిన కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఐహెచ్పీఎల్)కు 33.75 శాతం, కేవీ రావుకు 0.29శాతం, వేద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 14.70 శాతం వాటాలు ఉండేవి.
- ఈ సెజ్లో రెండు విభాగాలున్నాయి. కాకినాడలోని కేఎస్పీఎల్ (కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్), కేజీపీఎల్ (కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్)లు ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా వాటాదార్లను ఒక్కొక్కరిని తప్పిస్తూ వస్తున్నారని, ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
- అంతేకాదు.. రాష్ట్రంలోని ఏదైనా ఒక పోర్టుని నిర్వహిస్తున్న సంస్థకు 75కిలోమీటర్ల దూరంలోపు మరో పోర్టు అప్పజెప్పకూడదు. ఆ కంపెనీ 25శాతం కంటే ఎక్కువగా ఉన్న ఏదేని సంస్థ, కంపెనీకూడా ఆ పోర్టును తీసుకోకూడదు. అలాంటిది కాకినాడ సీపోర్టులో 41.1శాతం వాటాలు ఉండగా కాకినాడ గేట్ వే పోర్టు లిమిటెడ్లో 99శాతం వాటాకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
- ఇక షేర్ల బదలాయింపు, ఏపీ మారిటైం బోర్డు లేఖ, స్టాక్ ఎక్సేంజీల వ్యవహారాలు, జీఎంఆర్కు ఉన్న వాటాల బదలాయింపు తేదీల్లో గందరగోళం ఉందని, నిబంధనలు పాటించకుండా వాటాల బదిలీ జరిగిందనే ఆరోపణలు టీడీపీ నుంచి వస్తున్నాయి.
- https://www.youtube.com/watch?v=oWU_ZVkCzUs
- Also Read ;- క్విడ్ ప్రో కో నేటికీ కొనసాగిస్తున్న జగన్ : సబ్బం హరి