కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గన్నవరం మండలం మల్లవల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గ్రామస్థులు అడ్డుకున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ లే అవుట్లో ఏర్పాటు చేసిన టెంట్లు పీకేసి నిరసన తెలిపారు. వంశీ చేతుల మేదగా పట్టాలు తీసుకునేది లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులను భారీగా మోహరించారు.
గన్నవరం వైసీపీలో రచ్చ నిత్యకృత్యం
సోమవారం గన్నవరం మండలం సూరంపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీలోనూ యార్లగడ్డ, వల్లభనేని వంశీ వర్గాలు తలపడ్డాయి. ఇవాళ మరోసారి మల్లవల్లిలో వంశీని గ్రామస్థులు అడ్డుకున్నారు. గన్నవరం వైసీపీ శ్రేణులు మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే అన్న చందంగా తయారయ్యారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే వంశీ వైసీపీలో చేరడంతో వైసీపీ అధినేతకు తలనొప్పులు తప్పడం లేదు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారు పెత్తనం చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు గన్నవరంలో రచ్చకు దిగడం నిత్యకృత్యంగా మారింది.
Must Read ;- గన్నవరంలో వైసీపీ దళిత నేత ఆత్మహత్యాయత్నం