మెగా హీరో వరుణ్ తేజ్ – కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గద్దలకొండ గణేష్. ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన పూజా హేగ్డే నటిస్తే.. అధర్వ సరసన మృణాళిని నటించింది. ఆ సినిమాలో బుజ్జమ్మగా.. పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. అందం, అభినయంతో అలరించి కుర్రకారు మనసులను దోచుకుంది. ఇక ఈ అమ్మడుకి తెలుగులో వరుసగా అవకాశాలు వస్తాయి. ఫుల్ బిజీ అయిపోతుంది అనుకున్నారు. బిజీ మాట పక్కన పెడితే.. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ రాలేదు.
ఇటీవల తెలుగులో యువ హీరోల సినిమాలు చాలా స్టార్ట్ అయ్యాయి. అంతే కాకుండా ఒక్కో హీరో చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అయినా ఏ ఒక్క యంగ్ హీరో మూవీలో కూడా మృణాళినికి అవకాశం రాలేదు. కనీసం సెకండ్ హీరోయిన్ గా కూడా ఛాన్స్ రాలేదు. టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు కదా.. మృణాళిని ఖాళీగా ఉంది అనుకుంటే.. పొరపాటే. విషయం ఏంటంటే.. కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతుంది.
గద్దలకొండ గణేష్ తర్వాత కోలీవుడ్ లో ప్రయత్నించింది. ఈ అమ్మడు ప్రయత్నం అక్కడ ఫలించింది. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతుంది. ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా.. శాండిల్ వుడ్ లో కూడా సినిమా చేస్తుంది. మరో విషయం ఏంటంటే.. హిందీలోను ఓ సినిమా చేస్తుందని సమాచారం. తమిళ్ లో చేస్తున్న ఎంజీఆర్ మగన్, జంగో, కోబ్రా, ఎనిమీ సినిమాల్లో నటిస్తుంది. కన్నడ మూవీ పొగరు వచ్చే నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలన్నీ ఈ సంవత్సరంలోనే రిలీజ్ కాబోతుండడం విశేషం. మరి.. ఈ సినిమాలతో సక్సస్ సాధించి కెరీర్ గ్రాప్ పెంచుకుంటే.. అప్పుడు టాలీవుడ్ లో ఛాన్స్ లు దక్కించుకుంటుందేమో చూడాలి.
Must Read ;- బాలీవుడ్ లో దూసుకెళుతోన్న రకుల్