కన్నడ స్టార్ హీరో యశ్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన సంచలన చిత్రం కేజీఎఫ్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన కేజీఎఫ్ దేశ వ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. కేజీఎఫ్ లో ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానం కేజీఎఫ్ 2లో ఉంటుంది. దీంతో ఎప్పుడెప్పుడు కేజీఎఫ్ 2 వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇటీవల రిలీజ్ చేసిన కేజీఎఫ్ 2 టీజర్ ఇప్పటి వరకు ఉన్న రికార్డులను క్రాస్ చేసి యూట్యూబ్ ని షేక్ చేసింది. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇందులో యశ్ సరసన శ్రీనిథి నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. తెలుగు యాక్టర్ రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. నిర్మాణపరంగా ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీని జులై 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. దాంతో ఎప్పుడెప్పుడు కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతుందా..? రాకీ భాయ్ ని తెర పై చూస్తామా..? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. కేజీఎఫ్ ఫ్యాన్ ఏకంగా ఈ సినిమా గురించి ప్రధాని మోదీకి ట్వీట్ చేయడం విశేషం. ఇంతకీ ఏమని ట్వీట్ చేసాడంటే.. ఫ్యాన్స్ ఎమోషన్స్ ని దృష్టిలో పెట్టుకుని కేజీఎఫ్ 2 మూవీ రిలీజ్ రోజున సెలవు ప్రకటించాలి అని కోరాడు. ఇలా కేజీఎఫ్ 2 కోసం ఏకంగా ప్రధానికే ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- రాకీభాయ్ షాకింగ్ రెమ్యూనరేషన్
Dear @PMOIndia @narendramodi sir Consider Fans Emotion🥰😁 And Declare National Holiday On 16/7/2021💥#KGFChapter2 #YashBOSS #KGFChapter2onJuly16 pic.twitter.com/1Idm64pgwV
— Rocky 4DX (@styles_rocking) January 30, 2021











