తిరుపతి 45వ డివిజన్కు చెందిన టీడీపీ కార్యకర్త గొల్ల లోకేష్ నాయుడిపై వైసీపీ నాయకులు చేసిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. తాను అండగా ఉంటానంటూ బాధిత కార్యకర్తకు ఆయన భరోసా ఇచ్చారు.తనపై పది మంది వైసీపీ నాయకులు దాడి చేయడంతో తన మూడు పళ్లు ఊడిపోయాయని బాధితుడు తెలిపారు. తనపై దాడి చేయడమే కాకుండా తన భార్య ఉన్న సమయంలో తమ షాపును కూడ ధ్వంసం చేశారని బాధితుడు లోకేష్కు తెలిపారు. పోలీస్ స్టేషన్కు సుమారు 100 అడుగుల దూరంలో ఉన్న తమ షాపును దుండగులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు తెలిపారు. దాడిలో తన మూడు పళ్లు ఊడిపోయాయని కేసు పెట్టే సమయంలో సమయంలో చెబితే మూడుపళ్లు ఊడిపోతే రక్తం కూడ రాలేదని సీఐ హేళనగా మట్లాడారని లోకేష్ నాయుడు తెలిపారు.దీనికి లోకేష్ స్పందిస్తూ దాడిపై పోలీసులు తగిన చర్యలు తీసుకుని నిందితులను పట్టుకోకపోతే , పోలీసులపైనే కేసు పెడతామని అన్నారు. బాధిత టీడీపీ కార్యకర్తను తిరుపతి స్థానిక నాయకులు పట్టాభి తదితరులు పరామర్శించారు. కాగా, తిరుపతి 45వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి పోటీలో ఉండటమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.
Must Read ;- ప్రశాంత విశాఖలో వైసీపీ చిచ్చు.. ఓటుతో బుద్ధిచెప్పాలన్న లోకేష్











