పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. భారీ పీరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ రాధేశ్యామ్ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్న ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, బంగార్రాజు.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం… పాటలు రిలీజ్ చేస్తూ.. ప్రమోషన్స్ లో దూసుకెళుతున్నాయి కానీ.. సంక్రాంతికి వస్తున్న రాధేశ్యామ్ మాత్రం ఇప్పటివరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు.
ఇప్పటివరకు రాధేశ్యామ్ నుంచి ఒక్క పాట కూడా బయటకు రాలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు బాగా ఫీలవుతున్నారు. ఏకంగా ఓ ప్రభాస్ అభిమాని అయితే.. సూసైడ్ లెటర్ రాసి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ మేటర్ ఏంటంటే… ప్రభాస్ అభిమాని తన చావుకి యూవీ క్రియేషన్స్ వారే కారణమని చెప్పడంతో పాటు ఆ నిర్మాణ సంస్థను, హీరో ప్రభాస్ను ట్యాగ్ చేశాడు. ఈ లెటర్ రాసింది ఒక రెబెల్ స్టార్ ఫ్యాన్ అయినా.. ఇది ప్రతీ రెబెల్ స్టార్ ఆవేదన అని అర్ధం చేసుకోండి అంటూ సూసైడ్ నోట్ ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
ఇప్పటి వరకు ఒక్క లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా ఊహించలేదు. మీరు రాధేశ్యామ్ అప్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల నేను ఈ నోట్ రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్ డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు ఎదురు చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్… నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ టీంకి చిన్న రిక్వెస్ట్. ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకోవద్దు. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్ అని ప్రభాస్ అభిమాని ఆ నోట్లో పేర్కొన్నాడు. ఈ లెటర్ తో యు.వి. క్రియేషన్స్ టెన్షన్ పడుతుందని వార్తలు వస్తున్నాయి. మరి.. దీని పై ప్రభాస్ గానీ, యూవీ వారు గానీ ఎలా స్పందిస్తారేమో చూడాలి.
Must Read ;- అనుష్క సినిమా ఆగిపోలేదండోయ్